SC: ధన్ఖడ్, రిజిజులపై పిటిషన్.. విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు
న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాంబే లాయర్ల సంఘం వేసిన పిటిషన్పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనల విషయంలో సుప్రీం కోర్టు విశాల దృక్పథంలో వ్యవహరిస్తుందని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైందని తెలిపింది.