Trump: అధికారం కోసం ట్రంప్ అంతకు తెగించారా?
అధ్యక్ష పదవిలో కొనసాగడం కోసం ట్రంప్ ఎంత దూరం వెళ్లారో నిరూపించే ఆసక్తికర ఆధారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది....
వాషింగ్టన్: అధికారాన్ని అట్టిపెట్టుకోవడం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది క్రితం ఎంత హంగామా సృష్టించారో గుర్తుంది కదా! తాజాగా అధ్యక్ష పదవిలో కొనసాగడం కోసం ఆయన ఎంత దూరం వెళ్లారో నిరూపించే ఆసక్తికర ఆధారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకోమని ఆదేశిస్తూ రక్షణశాఖ సెక్రటరీకి ఓ లేఖ రాయడానికి ఆయన సిద్ధమయ్యారట. దానికి సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ, చివరకు దాన్ని అధికారికంగా జారీ చేయలేకపోయారని వెల్లడైంది.
ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఓటమి ఖాయమైన తర్వాత ఆయన మద్దతుదారులు జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి దిగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న హౌస్ కమిటీకి తాజాగా ఈ ముసాయిదా లేఖ లభ్యమైంది. అయితే, దాన్ని ఎవరు రూపొందించారన్నది మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. ట్రంప్ విచారణ నుంచి తప్పించుకోలేరంటూ ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తరుణంలో ఈ లేఖ బయటకు రావడం గమనార్హం.
అమెరికా ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా శ్వేతసౌధాన్ని అట్టిపెట్టుకోవడం కోసం ట్రంప్, ఆయన సన్నిహిత వర్గాలు ఎంత వరకు తెగించాయో ఈ లేఖ నిరూపిస్తోందని బైడెన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ముసాయిదా లేఖలో పేర్కొన్నట్లు రక్షణశాఖ సెక్రటరీ ఓటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకొని ఉంటే ఫలితాల నిర్ధారణ మరో 60 రోజులు ఆలస్యమయ్యేది. తద్వారా ఫిబ్రవరి వరకు ట్రంప్ అధికారంలో ఉండేందుకు అవకాశం దొరికేది. నిబంధనల ప్రకారం.. రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు ఉంటే అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫలితాలను విశ్లేషించి తుది నివేదికను సమర్పించడానికి రక్షణ శాఖకు 60 రోజుల సమయం ఉంటుంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ ట్రంప్ తన ఆదేశాల్ని జారీ చేయాలని విఫలయత్నం చేశారు.
ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఓటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకోవాలన్న వాదనను అప్పటి ట్రంప్ బృందంలో ఉన్న న్యాయవాది సిడ్నీ పావెల్ బలంగా వినిపించారు. సరిగ్గా అదే సమయంలో ఈ లేఖ కూడా రాసినట్లు ఉండడంతో బహుశా ఆమే దాన్ని రూపొందించి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యం కూడా ఉన్నట్లు లేఖలో ఆరోపించడం గమనార్హం. ఓటింగ్ యంత్రాలను తయారు చేసిన ‘డొమీనియన్ ఓటింగ్ సిస్టమ్స్’ అనే కంపెనీని విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఫలితాలు బైడెన్కు అనుకూలంగా మార్చేందుకు ఓటింగ్ యంత్రాల్లో డొమీనియన్ మార్పులు చేసిందని ఆరోపించారు. ఏదేమైనప్పటికీ అధికారం కోసం ట్రంప్ వేసిన ఏ పాచికలూ పారలేదు. ప్రజల తీర్పు మేరకు చివరకు బైడెన్ అధికార పగ్గాలు స్వీకరించారు. సొంత పార్టీ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో చివరకు ట్రంప్ పరాభవంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం