Tonga: ‘ఆ పేలుడు శక్తి.. వందల హిరోషిమా అణుబాంబులకు సమానం’
ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన విషయం తెలిసిందే. దీని ధాటికి సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైంది. అక్కడ సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో విధ్వంసం స్థాయి ఇంకా పూర్తిగా వెలుగులోకి...
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన విషయం తెలిసిందే. దీని ధాటికి సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైంది. అక్కడ సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో విధ్వంసం స్థాయి ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. ఇదిలా ఉండగా, ఈ అగ్నిపర్వత విస్ఫోటం.. జపాన్లోని హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే వందల రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసినట్లు నాసా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. అగ్నిపర్వతం పేలిన సమయంలో విడుదలైన శక్తి.. 5- 30 మెగాటన్నుల టీఎన్టీ మధ్యలో ఉంటుందని భావిస్తున్నట్లు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు పేలుడు శక్తి (దాదాపు 15 కిలో టన్నుల టీఎన్టీ)కంటే ఇది వందల రెట్లు ఎక్కువని చెప్పారు.
అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు వాతావరణంలో 40 కిలోమీటర్ల మేర బూడిద, పొగ వ్యాపించినట్లు నాసా ఎర్త్ అబ్జర్వేటరీ తెలిపింది. ఈ పేలుడు తీవ్రతకు టోంగా ద్వీపంలోని 65 కిలోమీటర్ల మేర ప్రాంతం తుడిచిపెట్టుకుపోయినట్లు చెప్పింది. ‘ఈ ఘటన.. టోంగాను విషపూరిత బూడిదతో కప్పేసింది. నీటి వనరులను కలుషితం చేసింది. పంటలు నాశనమయ్యాయి. రెండు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి’ అని వెల్లడించింది. స్థానికులు ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. హానికర బూడిద కారణంగా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రక్షణ దళాలు.. టోంగాకు అత్యవసర సహాయ సామగ్రిని చేరవేయడంలో నిమగ్నమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!