Omicron: ఒమిక్రాన్ ప్రాణాంతకమే.. మనుషుల్ని చంపేస్తోంది..!
కరోనా కొత్త రకం ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రత గత వేరియంట్ల కంటే తక్కువగా ఉందంటూ వస్తోన్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)
ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేం.. డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
ఇంటర్నెట్డెస్క్: కరోనా కొత్త రకం ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రత గత వేరియంట్ల కంటే తక్కువగా ఉందంటూ వస్తోన్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మరోసారి తీవ్రంగా స్పందించింది. ఒమిక్రాన్ను తేలికపాటి వ్యాధి అని చెప్పడంలో అర్థం లేదని.. ఇది కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని హెచ్చరించింది. ఒమిక్రాన్ బాధితులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు.
‘‘డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు (ముఖ్యంగా టీకాలు వేసుకున్న వారిలో) కన్పిస్తున్నప్పటికీ.. దీన్ని తేలికపాటి వ్యాధిగా పరిగణించడం సరైంది కాదు. ఇప్పటికే చాలా దేశాల్లో డెల్టా కంటే ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా కొన్ని దేశాల్లో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గత వేరియంట్లలాగే ఒమిక్రాన్ బాధితులు కూడా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇది కూడా మనుషుల్ని చంపేస్తోంది. నిజం చెప్పాలంటే కేసులు సునామీలా విరుచుకుపడుతున్నాయి. ఇవి యావత్ ప్రపంచంలోని ఆరోగ్య వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి’’ అని టెడ్రోస్ ప్రపంచాన్ని హెచ్చరించారు.
టీకా అసమానతల వల్లే..
వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతల వల్లే ఎన్నో ప్రాణాలు మహమ్మారికి బలవుతున్నాయని టెడ్రోస్ విచారం వ్యక్తం చేశారు. ‘‘టీకాల వినియోగంలో సంపన్న దేశాల స్వార్థపూరిత చర్యల వల్లే కొత్త వైరస్ వేరియంట్లు ఉద్భవించేందుకు ఆస్కారం కలిగింది. టీకాల అసమానతలే ప్రజల మరణాలకు కారణమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను బలహీనపరుస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలకు కనీస వ్యాక్సిన్ల రక్షణ(ఒక్క డోసు కూడా ఇవ్వకుండా) లేకుండా.. కొన్ని దేశాలు తమ ప్రజలకు బూస్టర్ల మీద బూస్టర్లు ఇచ్చినంత మాత్రాన మహమ్మారిని అంతం చేయలేం. కనీసం 2022లో అయినా దేశాలు పారదర్శకంగా వ్యవహరించాలి. టీకాలను పంచుకోవడంలో సమతుల్యం పాటించాలి. అప్పుడే ఈ వినాశకర కొవిడ్ను ఆపగలం. 2022 మధ్య నాటికి ప్రతి దేశం కనీసం 70శాతం ప్రజలకు టీకాలు అందించాలి’’ అని టెడ్రోస్ సూచించారు.
ఒమిక్రానే చివరిది కాదు..!
ఇక ఒమిక్రాన్.. ఆందోళనకర రకాల్లో చివరి వేరియంట్ అని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్వో కొవిడ్ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వేరియంట్లు వస్తాయో ఊహించలేమని అన్నారు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, వైరస్ నుంచి రక్షణకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. ముఖానికి మాస్క్లు అంటే ముక్కు, నోరు కప్పి ఉంచేలా పెట్టుకోవాలని అన్నారు. అంతేగాని, గడ్డం కిందకు మాస్క్ను వేలాడదీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు