Vaccine: వారికి బూస్టర్ డోస్ అవసరంపై ఆధారాల్లేవు: సౌమ్య స్వామినాథన్
ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా బూస్టర్ డోసు అవసరమని ఏ పరిశోధనలోనూ తేలలేదని, దానికి ప్రమాణికమైన ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథ్ వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాసహా అనేక దేశాలు పిల్లలు
వాషింగ్టన్: ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా బూస్టర్ డోసు అవసరమని ఏ పరిశోధనలోనూ తేలలేదని, దానికి ప్రామాణికమైన ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ప్రస్తుతం అనేక దేశాలు చేపట్టిన బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘కొవిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు, తీవ్ర వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వైద్య సిబ్బందిని కాపాడటమే లక్ష్యంగా బూస్టర్ డోసును ఉపయోగించాలి. అంతే కానీ, అందరికీ ఇవ్వకూడదు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, పెద్దలకు బూస్టర్ డోసు అవసరమని తెలిపే ఆధారాలేవి లభించలేదు’’అని సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తీసుకున్న రెండు కొవిడ్ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేయలేకపోవచ్చని, రోగనిరోధక శక్తిని మరింత పెంచుకునేందుకు బూస్టర్ డోసు అవసరమని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక దేశాలు బూస్టర్ డోస్ డ్రైవ్ను చేపట్టాయి. అమెరికాలో ఇటీవల ఫైజర్, బయోఎన్టెక్ కొవిడ్ టీకాలను బూస్టర్డోసుగా ఇచ్చేందుకు అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) అనుమతించింది. దీంతో అమెరికా ప్రభుత్వం పెద్దలతోపాటు 12 -15ఏళ్ల మధ్య ఉన్న యువతకూ ఈ బూస్టర్ డోసును ఇస్తోంది. కాగా.. బూస్టర్ డోసు ఇచ్చే విధానం ఇది కాదని సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఎవరికి ఈ బూస్టర్ డోస్ అవసరమవుతుందో తెలుసుకునేందుకు ఇంకా విసృతమైన పరిశోధన చేయాల్సి ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.