విదేశీ ప్రయాణికులు.. ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉండక్కర్లేదు!: కేంద్రం

ఎయిర్​పోర్ట్​లో జరిపిన పరీక్షల్లో పాజిటివ్​​ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం​ తప్పనిసరి కాదని వెల్లడిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.......

Updated : 22 Jan 2022 01:49 IST

దిల్లీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్​ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్​పోర్ట్​లో జరిపిన పరీక్షల్లో పాజిటివ్​​ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం​ తప్పనిసరి కాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వారు సాధారణ కొవిడ్​ ప్రోటోకాల్​ అనుసరిస్తే సరిపోతుందని పేర్కొంది.

ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీటినే అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా తాజా నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

స్క్రీనింగ్ సమయంలో వైరస్​ లక్షణాలను గుర్తించినట్లయితే ఆ ప్రయాణికులు వెంటనే ఐసోలేషన్​కు వెళ్లాలని కొవిడ్​ ప్రొటోకాల్​ చెబుతోంది. అంతేగాకుండా వారి ప్రైమరీ కాంటాక్ట్​లను కూడా గుర్తించి పరీక్షలు నిర్వహించాలి. భారత్​కు వచ్చిన విదేశీయులు కరోనా పాజిటివ్​ వచ్చిన తరువాత ఏడు రోజులు హోం క్వారెంటైన్​లో ఉండాలి. 8వ రోజు నెగటివ్​ వచ్చిన తరువాత కూడా వారు మరో 7 రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని