Omicron: వారంలో 71% పెరిగినకొత్త కేసులు: డబ్ల్యూహెచ్వో
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం రేపుతోంది. ప్రధానంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉంది.
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం రేపుతోంది. ప్రధానంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా 71% కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబరు 27 - జనవరి 2 మధ్య అంతకు ముందు వారంతో పోలిస్తే ఈ పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గురువారం తెలిపింది. అయితే కొంత ఊరటనిచ్చేలా.. కొత్తగా నమోదైన మరణాల సంఖ్య 10% తగ్గినట్లు వెల్లడించింది. ఈమేరకు గత వారంలో 95 లక్షల కేసులు నమోదు కాగా, 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అమెరికాలో కేసులు 100% పెరగ్గా, ఆగ్నేయాసియాలో 78%, ఐరోపాలో 65%, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 40%, పశ్చిమ పసిఫిక్లో 38%, ఆఫ్రికన్ ప్రాంతంలో 7% కేసులు పెరిగినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
- ప్రపంచవ్యాప్తంగా బుధవారం 25.7 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 7,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే 7 లక్షలకు పైగా రోజువారీ కేసులు బయటపడ్డాయి. ఫ్రాన్స్ (3.3 లక్షలు), బ్రిటన్ (1.9 లక్షలు), ఇటలీ (1.89 లక్షలు), స్పెయిన్ (1.37 లక్షలు)లోనూ భారీగా కేసులు నమోదయ్యాయి.
- అమెరికాలోని కాలిఫోర్నియాలో అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది కొవిడ్ బారిన పడటంతో ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రమవుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసి పోతుండగా.. వారికి చికిత్సలు అందించలేని పరిస్థితి ఎదురవుతోంది. దాదాపు 40% ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది.
- సింగపూర్లో డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్తో మరింత పెద్ద కొవిడ్ వేవ్ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. డెల్టా వేరియంట్ కేసులు రెట్టింపు కావడానికి 6-8 రోజులు పట్టగా.. ఒమిక్రాన్ విషయంలో కేవలం రెండు మూడు రోజుల్లోనే ఆ స్థాయికి పెరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
- చైనాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జియాన్ నగరానికి అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. డిసెంబరు ప్రారంభం నుంచి ఇక్కడ లాక్డౌన్ అమలవుతుండగా.. ఇప్పటికే దేశీయ విమానాలపై నిషేధం విధించారు.
- థాయిలాండ్లో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం 4వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఇక్కడ 5,775 కొత్త కేసులు బయటపడ్డాయి. 4వ హెచ్చరిక ప్రకారం.. అధిక ముప్పు ఉన్న ప్రాంతాలను మూసివేస్తారు. అంతర్గత ప్రయాణాలపై ఆంక్షలు పెంచుతారు. బహిరంగ ప్రాంతాల్లో
గుమిగూడటంపై పరిమితి విధిస్తారు.
- ఫిలిప్పీన్స్లో కొవిడ్ పాజిటివిటీ రేటు ఏకంగా 36.9%కి పెరిగింది. అంటే పరీక్షలు జరిపిన ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. ఇక్కడ గురువారం 17,220 కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM