China: చైనా సమర్పించు.. చెవిలో పూలు..!
‘జీరో కొవిడ్ పాలసీ’..! కోట్ల మంది కఠిన లాక్డౌన్లోకి..! వైరస్ను అణిచివేతకు పరుగులు పెడుతున్న అధికారులు.. ఇటీవల కాలంలో చైనా నుంచి తరచూ వెలువడుతున్న
ఒమిక్రాన్ను కూడా వాడుకొనే పనిలో డ్రాగన్..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘జీరో కొవిడ్ పాలసీ’..! కోట్ల మంది కఠిన లాక్డౌన్లోకి..! వైరస్ అణచివేతకు పరుగులు పెడుతున్న అధికారులు.. ఇటీవల కాలంలో చైనా (china) నుంచి తరచూ వెలువడుతున్న వార్తలివి. ఒకటీ అరా కేసులు వస్తోంటేనే కఠిన చర్యలు తీసుకొంటున్నామని అధికారులు గొప్పగా చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అక్కడ పుట్టగొడుగుల్లా వైరస్ అవుట్బ్రేక్ (వైరస్ నిర్ణీత ప్రాంతంలో వ్యాపించడం)లు వస్తున్నాయని చైనా వైరాలజిస్టు ఒకరు ఆంగ్ల పత్రిక సీఎన్ఎన్కు తెలియజేశారు. ఏబీసీ సంస్థ అక్కడ అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. వైరస్పై పోరులో గ్లోబల్ లీడర్గా ప్రచారం చేసుకొనేందుకు చైనా వీటిని వీలైనంత తక్కువ చేసి చూపిస్తోంది. చైనా (china) నుంచి వచ్చిన కొంత సమాచారం చూస్తే అసలు ఇది నిజమేనా అనిపిస్తుంది.
చైనా (china) కొవిడ్ డేటాలో సమాచార లోపం..
చైనా నుంచి వచ్చే కొవిడ్ డేటాలో సమాచార లోపం ఉందని క్వాంటిటేటివ్ ఫైనాన్స్ నిపుణుడు జార్జి చాహున్ చెబుతున్నారు. ది ఎకానమిస్టు పత్రిక ఎంఎల్ మోడల్ పేరిట 121 అత్యాధునిక స్టాటిస్టికల్ టెక్నిక్స్ వాడి 200 దేశాల కొవిడ్ డేటాను పరిశీలించింది. ఇలాంటి విధానాలతోనే చైనా బాహ్య ప్రపంచానికి కొద్దిగా వెల్లడించిన డేటాను జార్జి చాహున్ పరిశీలించడంతో లోపాలు స్పష్టంగా కనిపించాయి.
కొన్నాళ్లుగా చైనా (china) నుంచి కొవిడ్ మృతుల సంఖ్యలు అస్సలు బాహ్య ప్రపంచానికి వెల్లడి కావడంలేదు. మృతుల సంఖ్య ఆధారంగా కొవిడ్ ప్రభావం ఆ దేశ ప్రజలపై ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు. చైనా నుంచి డేటా అందడంలేదు. దీంతో ప్రభావాన్ని అంచనా వేసే సమయంలో చైనాను పరిగణనలోకి తీసుకోవడంలేదు. కొవిడ్పై జరిగే సైన్స్ పరిశోధనలకు చైనా ఏమాత్రం సహకారం అందించడంలేదు. ఫలితంగా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది.
చైనాలో ప్రతి లక్ష జనాభాలో కొవిడ్ మరణాల రేటు దక్షిణ కొరియా కంటే 30 రెట్లు తక్కువని.. సింగపూర్ కంటే 50రెట్లు తక్కువని.. అదే న్యూజిలాండ్తో పోలిస్తే 73 రెట్లు తక్కువగా ఉందని డ్రాగన్ సర్కారు ప్రచారం చేస్తోంది. చైనా వలే ఈ మూడు దేశాలు కూడా కఠినమైన కొవిడ్ నిబంధనలు అమలు చేశాయి. వీటిల్లో ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యాక్సినేషన్ కూడా సమర్థంగా జరిగింది.
హాంకాంగ్కు.. చైనాకు ఇంత తేడా దేనికి..?
కొవిడ్ వ్యాప్తికి ముందే చైనా హాంకాంగ్ను గుప్పిట బంధించింది. హాంకాంగ్లో కొవిడ్ నియంత్రణకు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2020లో జనవరి-ఏప్రిల్ మధ్యలో చైనాలో 81,596 కేసులు నమోదుకాగా.. 4,636 మంది మృతి చెందారు. అదే సమయంలో హాంకాంగ్లో 765 కేసులు రాగా.. నలుగురు మృతి చెందారు.
2020 ఏప్రిల్ తర్వాత నుంచి జనవరి 8, 2022 వరకు చైనాలో 22,102 కేసులు రాగా ఒక్కరు కూడా మృతి చెందలేదని డ్రాగన్ చెబుతోంది. అదే సమయంలో చైనా (china) నియంత్రణలోని హాంకాంగ్లో 12,005 కేసులు రాగా.. 209 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయని ఫోర్బ్స్ పత్రిక కథనం పేర్కొంది.
ఏప్రిల్ వరకు చైనాలో కొవిడ్ సోకిన వారి మరణాల రేటు నూటికి 5.7శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కానీ, ఏప్రిల్ తర్వాత నుంచి విచిత్రంగా ఇది 0శాతానికి పడిపోయింది. అది కూడా 22 వేల కేసులు నమోదయ్యాక కావడం గమనార్హం. ప్రపంచ సగటు 1.8శాతం కాగా.. హాంకాంగ్లో 1.6శాతం.. అమెరికాలో 1.3శాతంగా నమోదయ్యాయి.
భారీగా పెరిగిన సాధారణ మరణాలు..!
2019 నుంచి చైనాలో సాధారణ మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రపంచ సగటు కంటే ఇవి చాలా ఎక్కువగా నమోదైనట్లు ప్రపంచ బ్యాంక్, ఐరాస వద్ద ఉన్న నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ మరణాల రేటు స్వల్పంగా పెరిగినా.. చైనాలో నాటకీయంగా పెరిగినట్లు గ్రాఫ్లు చెబుతున్నాయి. 2019లో ప్రపంచ వ్యాప్తంగా సాధారణ మరణాల రేటు 1000కి 0.3 ఉండగా.. చైనాలో 2.0శాతంగా ఉంది. చైనాలో 2018 వరకు ఉన్న ట్రెండ్తో పోల్చినా.. 1,62,018 మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా సాధారణ మరణాలు 0.4శాతం ఉండగా.. చైనాలో 1.9శాతంగా నమోదయ్యాయి. 2021లో ప్రపంచ వ్యాప్తంగా సాధారణ మరణాల సగటు 0.9శాతం ఉండగా.. చైనాలో 1.9శాతంగా ఉంది. మొత్తం మీద ఈ మూడేళ్లలో అక్కడ 9,81,222 మరణాలు అధికంగా నమోదైనట్లు ఐరాస డేటా లెక్కలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ