Omicron: దేశంలోకి ‘ఒమిక్రాన్’
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోనూ బయటపడ్డాయి. తొలిసారిగా.. కర్ణాటకలో ఇద్దరు పురుషుల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. ఈ ఇద్దరిలోనూ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియమ్ ‘ఇన్సాకోగ్’ ఈ కేసులను గుర్తించినట్లు చెప్పారు. కర్ణాటకలో వెలుగు చూసిన
బెంగళూరులో 2 కేసులు
బాధితుల్లో ఒకరు దక్షిణాఫ్రికా వాసి
బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు పాజిటివ్.. సీసీఎంబీకి నమూనాలు
ఈనాడు డిజిటల్, బెంగళూరు / దిల్లీ
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోనూ బయటపడ్డాయి. తొలిసారిగా.. కర్ణాటకలో ఇద్దరు పురుషుల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. ఈ ఇద్దరిలోనూ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియమ్ ‘ఇన్సాకోగ్’ ఈ కేసులను గుర్తించినట్లు చెప్పారు. కర్ణాటకలో వెలుగు చూసిన ఒమిక్రాన్ కేసులకు సంబంధించి.. ఒకరు దక్షిణాఫ్రికా వాసి (66) కాగా, మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తి (46)గా బృహత్ బెంగళూరు మహానగర పాలికె చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా తెలిపారు. నవంబరు 20న నగరానికి వచ్చిన దక్షిణాఫ్రికా వాసికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ తేలడంతో నేరుగా ఓ హోటల్లో క్వారంటైన్ చేసినట్లు గుప్తా వివరించారు. మూడు రోజుల తర్వాత పరీక్షల్లో నెగెటివ్గా తేలడంతో ఆయనను డిశ్ఛార్జ్ చేశారు. అనంతరం నగరంలోని ఓ కంపెనీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా మళ్లీ నెగటివ్ రావడంతో నవంబరు 27న దుబాయ్ వెళ్లిపోయినట్లు గుప్తా తెలిపారు. దక్షిణాఫ్రికా వాసి శాంపిల్ను జన్యుక్రమ పరిశీలనకు పంపించగా కొత్త వేరియంట్గా గురువారం రిపోర్టు వచ్చినట్లు చెప్పారు. అలాగే ఒమిక్రాన్ సోకినట్లు తేలిన బెంగళూరు వాసి స్థానికంగా ఓ ఆసుపత్రిలో మత్తు వైద్య నిపుణుడుగా పనిచేస్తున్నారు. ఆయన ఎలాంటి విదేశీ ప్రయాణం చేయలేదు. నవంబరు 22న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రావడంతో శాంపిల్ను జన్యుక్రమ పరిశీలనకు పంపారు. ఆయనకు సోకింది ఒమిక్రాన్గా తేలడంతో ఆయనను ముందు ఇంటివద్ద ఐసొలేషన్లో ఉంచి అనంతరం ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నట్లు గుప్తా తెలిపారు. వీరిద్దరితో దగ్గరగా మెలిగిన దాదాపు 500 మందికి (ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్) జరిపిన పరీక్షల్లో ఇంతవరకు ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ ఐదుగురు కూడా బెంగళూరు వాసికి దగ్గరగా ఉన్న వారేనని (ప్రైమరీ-3, సెకండరీ-2 కాంటాక్ట్స్) గుప్తా వెల్లడించారు. విదేశీయాన చరిత్ర లేనప్పటికీ బెంగళూరు వాసికి ఒమిక్రాన్ సోకిందని.. అందువల్ల కొత్త వేరియంట్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒమిక్రాన్ సోకిన ఇద్దరూ రెండు డోసుల కొవిడ్ టీకా కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
దేశంలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయితే అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ స్పష్టం చేశారు. కొవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయడం తక్షణ అవసరమని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకోవడంలో ఎవరూ జాప్యం చేయవద్దన్నారు. ముప్పు ఉన్నట్లు భావిస్తున్న దేశాల నుంచి 7,976 మంది ప్రయాణికులు వచ్చారని.. వారిలో 10 మంది పాజిటివ్గా తేలడంతో జన్యుక్రమ పరిశీలనకు పంపించినట్లు తెలిపారు. బ్రిటన్ సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్లను ముప్పు ఉన్న దేశాలుగా గుర్తించారు.
లాక్డౌన్ అవసరం లేదు..
దేశంలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో లాక్డౌన్ విధించే అవకాశం ఉందా? అన్న విషయమై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవసరమేమీ లేదని చెప్పారు. దేశంలో కొవిడ్ పరిస్థితి అదుపులోనే ఉందని, భయాందోళనలు అవసరం లేదన్నారు. 18 ఏళ్లు పైబడినవారిలో 84.3% మంది కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారని, 49% రెండో డోసు కూడా పొందినట్లు అగర్వాల్ వివరించారు. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందన్నదీ లేనిదీ ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు.
హైదరాబాద్లో అప్రమత్తం..
ఈనాడు, హైదరాబాద్: బ్రిటిష్ ఎయిర్వేయిస్ ద్వారా 206 మంది ప్రయాణికులు బుధవారం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా వీరికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మహిళ(35)కు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ముప్పు ఉన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి కావడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆ మహిళను అత్యవసరంగా గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించి, ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ నుంచి నమూనాలను జన్యుక్రమ పరిశీలనకు గాను హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపించారు. ఈ ఫలితం వచ్చిన తర్వాత ఆమెకు సోకింది డెల్టానా? ఒమిక్రాన్ వేరియంటా? అనేది తెలుస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి. శుక్ర, శనివారాల్లో ఈ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆమెతో పాటు ప్రయాణించిన మిగిలిన ప్రయాణికులకు, అదేరోజు సింగపూర్ ఎయిర్లైన్స్లో వచ్చిన 119 మందికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందరిలోనూ నెగిటివ్గా ఫలితం వెల్లడైనట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. -
జపాన్లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు
జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్ట్) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం వెల్లడించింది. -
మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. -
మళ్లీ వరికే పెద్దపీట
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. -
చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!
కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్-1 పరిధిలో ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎ.వి.రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్