KCR: 18న మహాధర్నా
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నేను అడుగుతున్నా.. రైతులు, తెరాస నిన్ను నిలదీస్తే తప్పేంటి? అడిగితే నువ్వు దాడులు చేస్తున్నవ్.. రాళ్లతో కొట్టిస్తున్నవ్. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న బాధ్యతారాహిత్యంగా యాసంగిలో వరి వేయమన్నది నిజమా? కాదా? ఒకవేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలి. నీకు నిజాయతీ ఉంటే..
నాతో సహా మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులందరం పాల్గొంటాం
ధాన్యం సేకరణపై స్పష్టతకు ప్రధానికి లేఖ
రెండు రోజులు గడువిస్తాం.. స్పందించకుంటే వెంటాడి వేటాడతాం
రైతుల్ని గోస పెట్టిన భాజపాకు శిక్ష తప్పదు
నల్లచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం
ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నేను అడుగుతున్నా.. రైతులు, తెరాస నిన్ను నిలదీస్తే తప్పేంటి? అడిగితే నువ్వు దాడులు చేస్తున్నవ్.. రాళ్లతో కొట్టిస్తున్నవ్. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న బాధ్యతారాహిత్యంగా యాసంగిలో వరి వేయమన్నది నిజమా? కాదా? ఒకవేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలి. నీకు నిజాయతీ ఉంటే.. వరి వేయకండి అని చెప్పాలి. వర్షాకాలంలో వచ్చే ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందో లేదో స్పష్టం చేయాలి.
- సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరిగే ఈ ధర్నాలో తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ ఛైర్పర్సన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం గవర్నరుకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ధాన్యంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని, సంవత్సరానికి ఎఫ్సీఐ సేకరణ లక్ష్యమేంటో రెండు, మూడు రోజుల్లో చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తామన్నారు. తమకు వెంటనే సమాధానం కావాలన్నారు. రైతులను ఆగం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. వరిసాగుకు గడువు సమీపిస్తోందని, ఈనెల 18 తర్వాత రెండురోజుల్లో కేంద్రం నుంచి స్పందన లేకుంటే వెంటాడి, వేటాడతామన్నారు. రైతులను గోస పెట్టినందుకు భాజపాకు శిక్ష తప్పదని చెప్పారు. తెలంగాణలో వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, యాసంగి పంటలకు రైతుబంధు డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఈ దుర్మార్గుల్ని నమ్మితే నష్టపోయే ప్రమాదం ఉన్నందున యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తిచేశారు. కేంద్రం నుంచి స్పందన లేకపోతే ఆందోళనలను కొనసాగిస్తూనే ఈ నెల 20 వరకు చూసి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు ఇస్తామని తెలిపారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం మంత్రులు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.
‘వరి ధాన్యంపై భాజపా, కేంద్రం వైఖరి.. ముక్కు ఎక్కడ అంటే చుట్టూ తిప్పి చూపించినట్టు ఉంది’
అని తన వేలును ముక్కుపై పెట్టుకుని తల చుట్టూ తిప్పి చూపిస్తున్న కేసీఆర్
చేతులెత్తేసిన కేంద్రం
‘‘ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసింది. రైతు ప్రయోజనాలు కాపాడే ఉద్దేశం దానికి లేదు. గత సీజనుకు సంబంధించిన 20 లక్షల టన్నుల ధాన్యం కేంద్రం తీసుకోక గోదాముల్లో మూలుగుతోంది. 62 లక్షల ఎకరాల్లో పంట ఉందని చెప్పినా ఎటూ తేల్చడంలేదు. రాష్ట్రం కొనే పరిస్థితి లేదు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ ధాన్యం నిల్వ చేసే పరిస్థితి ఉండదు. ధాన్యాన్ని కొనడం, దేశ అసరాల కోసం బఫర్ స్టాక్ నిర్వహించడం కేంద్రం బాధ్యత. కేంద్రం పంజాబ్లో వడ్లు మొత్తం కొంటోంది. మన దగ్గర మాత్రం కొనడం లేదు. దిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి మీ పద్ధతి బాగాలేదని చెప్పా. మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో ఏడాది ముందే చెప్పమన్నాం. దీనిపై స్పష్టత వచ్చే వరకూ నేను ఇక్కడే ఉంటానన్నా. ఐదారు రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘంతో మాట్లాడి చెబుతామన్నారు. ఇప్పటి వరకూ ఉలూకూ పలుకూ లేదు.
రైతులపై దాడులను సహించం
వానాకాలం పంటల కొనుగోలుకు 6,600కు పైగా కేంద్రాలు ప్రారంభించాం. భాజపా అక్కడికి వెళ్లి నాటకాలు మొదలుపెట్టింది. వరి వేయాలో వద్దో చెప్పకుండా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే రాళ్లతో దాడులు చేస్తున్నారు. రైతులపై దాడులను సహించం. సంవత్సరం కాలంగా దిల్లీలో ధర్నాలు చేస్తే, వారిపై కార్లు ఎక్కించి చంపుతున్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు. మా ధాన్యం కొంటారా లేదా అని సూటిగా అడుతుంటే సమాధానం చెప్పకుండా రాజకీయం చేస్తున్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఊరుకోదు. తెరాసకు 60 లక్షల మంది సభ్యులు న్నారు. వారిలో కొన్ని లక్షలమంది రైతులు. వారు నిలదీస్తుంటే రాళ్లతో కొడుతున్నారు. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నం. రైతులపై దాడి చేసిన వారిపై కేసులు పెడతారు. వారికి తగిన శిక్ష పడుతుంది. కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాలను వద్దన్నాం. సాగు చట్టాలను వ్యతిరేకించాం. వచ్చే శాసనసభ సమావేశాల్లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి