EAMCET: ఆగస్టు 5-9 వరకు ఎంసెట్!
రాష్ట్రంలో ఎంసెట్ను ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అయిదు రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎంసెట్తో పాటు ఆగస్టు 3న ఈసెట్, అదే నెల 11-14 తేదీల్లో పీజీఈసెట్ నిర్వహించాలని నివేదించినట్లు తెలిసింది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ను ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అయిదు రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎంసెట్తో పాటు ఆగస్టు 3న ఈసెట్, అదే నెల 11-14 తేదీల్లో పీజీఈసెట్ నిర్వహించాలని నివేదించినట్లు తెలిసింది. వాస్తవానికి జూన్ 19-22 వరకు పీజీఈసెట్, జులై 1న ఈసెట్, జులై 5-9వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గత ఫిబ్రవరిలో నిర్ణయించింది. కరోనా పరిస్థితుల కారణంగా జులై వరకు వద్దనుకున్న అధికారులు వాటిని ఆగస్టులో నిర్వహించాలని కొద్ది రోజుల క్రితమే ప్రాథమికంగా నిర్ణయించారు. ఆన్లైన్ పరీక్షలను నిర్వహించే టీసీఎస్ డిజిటల్ అయాన్ ప్రతినిధులతో చర్చించిన అధికారులు తేదీలను ఖరారు చేసి విద్యాశాఖ మంత్రికి సమర్పించారు. జాతీయ పరీక్షలైన జేఈఈ మెయిన్ తదితర పరీక్షలను కూడా టీసీఎస్ డిజిటల్ అయానే నిర్వహిస్తున్నందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోని పరీక్షల తేదీలను వారు సూచించారని చెబుతున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన తేదీలకు ఆమోదం తెలపనుందని భావిస్తున్నారు.
అవి యథాతథం!
ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్, 23న లాసెట్, 24, 25 తేదీల్లో ఎడ్సెట్ను నిర్వహిస్తామని గతంలోనే ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దానివల్ల వాటి తేదీలను మార్చాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.
జేఈఈ మెయిన్ జులై నెలాఖరులో?
వాయిదా పడిన జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు జులై నెలాఖరులో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జేఈఈ మెయిన్ను నిర్వహించాలంటే అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ క్రమంలో జులై మూడో వారానికి అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని కేంద్రం అంచనాకు వచ్చిందని, అందుకే జాతీయ న్యాయ విద్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్)ను జులై 23వ తేదీన నిర్వహించాలని న్యాయ వర్సిటీల కన్సార్షియం నిర్ణయించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. జేఈఈ మెయిన్ మూడు, నాలుగు విడతలతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ జరపాల్సి ఉన్నందున జులైలో జరిపేందుకు జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఆయా తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు పరిస్థితిని అంచనా వేసి...అనుకూలంగా లేకుంటే వాటిని ఆగస్టుకు మార్చేందుకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు