Heavy rains in telangana: ఊరు.. ఏరైంది
నీరు, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకు పోయాయి. చెరువుల కట్టలు తెగి పోయాయి. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఐదు జిల్లాల్లో బడులకు సెలవు ప్రకటించారు....
ఉత్తర తెలంగాణలో వరద ఉద్ధృతి
పలు జిల్లాల్లో భారీ నష్టం
ఆరుగురి మృతి.. ఇద్దరి గల్లంతు
కోతకు గురైన నిజాంసాగర్ కాల్వ, ఊడిపడిన మాసాని చెరువు గేటు
వేములవాడలో కూలిన మూలవాగు వంతెన సెంట్రింగ్
నీరు, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకు పోయాయి. చెరువుల కట్టలు తెగి పోయాయి. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఐదు జిల్లాల్లో బడులకు సెలవు ప్రకటించారు.
ఈనాడు, ఈనాడు డిజిటల్, న్యూస్టుడే, యంత్రాంగం: నింగి, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకుపోయాయి. చెరువుల కట్టలు తెగిపోయాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. వర్షాలు, వరదలకు ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నిలిచిన రాకపోకలు
వరంగల్- కరీంనగర్ జాతీయ రహదారిపై, వరంగల్-ములుగు జాతీయ రహదారిపై కటాక్షపూర్ చెరువు వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, మున్నేరు, ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి-కరీంనగర్ మార్గంలో కమాన్పూర్ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప తూర్పు రోడ్డుకు గండి పడింది. రామప్ప సరస్సు మత్తడి ఉప్పొంగి నీరు ఉద్ధృతంగా రావడంతో ఈ రహదారి తెగిపోయింది. తాడ్వాయి మండలం జంపన్న వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహించడంతో మేడారంతోపాటు పరిసర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని వాగు ఉప్పొంగడంతో ఆవలి ఒడ్డున ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి వరద 34.5 అడుగులకు చేరింది. దుమ్ముగూడెం వద్ద 15.3 అడుగులకు పెరిగింది.
పట్టణాలను తేరుకోనివ్వని వర్షం
కరీంనగర్, వరంగల్ నగరాల్లో కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్లో హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్, సాయినగర్తోపాటు సుమారు 20 కాలనీలు నీట మునిగాయి. సుమారు 500 మందిని విపత్తు నిర్వహణ దళం పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
* కరీంనగర్లో 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు జలసంద్రాన్ని తలపించాయి. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, నిజామాబాద్లోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. రోడ్లే కాల్వలుగా మారాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు వరదకు కొట్టుకుపోయాయి.
* నిర్మల్ పట్టణంలోని గణేశ్నగర్ కోతి హనుమాన్ ప్రాంతం, వివేకానంద(కుభీరు) చౌరస్తా, వినాయక్నగర్, రాహుల్నగర్, గోకుల్నగర్, తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది.
నష్టం అపారం
* వరంగల్ జిల్లాలో 25 ఇళ్లకు నష్టం వాటిల్లింది. కొన్ని కూలిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 48 విద్యుత్ స్తంభాలు కూలాయి. పలుచోట్ల ఇళ్ల గోడలు కూలినట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లాలో 65 ఇళ్లకు నష్టం వాటిల్లింది.
* సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మూలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన మంగళవారం కూలిపోయింది. రాజన్న దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పాత వంతెనకు ఇరువైపులా రెండు వంతెనలను రూ.28 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పడమటి వైపు వంతెన పూర్తయి వినియోగంలోకి వచ్చినప్పటికీ తూర్పువైపు వంతెన నిర్మాణంలో ఉంది. 2019 సెప్టెంబరులో బీమ్లపై స్లాబ్ వేసే దశలో వర్షాలకు కూలిపోయింది. గత ఏడాది పనులు పునఃప్రారంభించగా గత నెలలో కురిసిన వర్షాలకు మళ్లీ కుంగిపోయింది. మంగళవారం నాటి భారీ వర్షాలకు మూలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెన కూలింది.
* కోనరావుపేట మండలం కొలనూరు చెరువు కట్ట తెగిపోయింది.
* కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం మహ్మద్నగర్ మధ్య రోడ్డు పూర్తిగా తెగిపోయింది. కరీంనగర్ మండలంలో ఎలబోతారం, ముగ్ధుంపూర్ చెక్డ్యామ్ల కరకట్టలు తెగిపోయాయి. కోరుట్ల, మెట్పల్లిల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ వద్ద జగిత్యాల ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
* నిజామాబాద్ నగర శివారుల్లో నిజాంసాగర్ నుంచి మాసాని చెరువుకు వెళ్లే కాల్వ కోతకు గురైంది. ప్రవాహ ఒత్తిడికి మాసాని చెరువు తూము గేటు కొట్టుకుపోయింది.
* సిద్దిపేట జిల్లా చిలప్చెడ్ మండలం జగ్గంపేట ప్రాథమిక పాఠశాలలో తరగతి గది పైకప్పు కూలింది. విద్యార్థులను ఉపాధ్యాయులు పక్కగదిలో కూర్చోబెట్టడంతో ప్రమాదం తప్పింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేయడంతో మెదక్ జిల్లాలోని పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది.
* నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూర్లో కోళ్లఫారంలోని 5 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గుడిపాడు చివారులోని రెండు నాటుకోళ్ల ఫారాలు చిన్నవాగు వరదలో చిక్కుకుని దాదాపు 500 కోళ్లు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు.
* వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సోమవారం 1,88,417 టన్నులకు గాను 92,265 టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధ్యమైంది. మంగళవారం సైతం ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి.
జల దిగ్బంధంలో సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం జలమయమైంది. జిల్లా కేంద్రానికి రాకపోకలు స్తంభించిపోయాయి. పట్టణానికి ఎగువన పెద్దచెరువు, జంగమయ్యకుంట, శుద్ధికుంట, కొత్త చెరువులు అలుగు పారడంతో 25 కాలనీలు నీటమునిగాయి. 146 కుటుంబాలకు అధికారులు పట్టణంలోని సినారె కళామందిరం, నర్సింగ్ కళాశాలలో పునరావాసం కల్పించారు. డీఆర్ఎఫ్ బృందం రెండు పడవలతో వచ్చి సహాయ చర్యలు చేపట్టింది. సమీకృత కలెక్టరేట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
11న మళ్లీ అల్పపీడనం
బంగాళాఖాతంలో ఈ నెల 11న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు నాగరత్న తెలిపారు. రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఛత్తీస్గఢ్ వైపు వెళ్లింది. అది ప్రయాణించిన మార్గంలో 20 సెం.మీ.లకు పైగా కుంభవృష్టి కురిసినట్లు వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. బుధవారం నుంచి 4 రోజుల దాకా రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు చెప్పారు.
తండ్రి, కుమారుడు సహా ఆరుగురి మృతి
వరద ప్రవాహం తండ్రీ కుమారుల ప్రాణాలు తీసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం నందిపల్లికి చెందిన కుడుకల గంగమల్లు(47), కుమారుడు విష్ణువర్ధన్(7)తో కలిసి మంగళవారం ఉదయం మల్లన్నపేట వెళ్లారు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న సమయంలో మల్లన్నపేట-వెంగళాపూర్ రహదారిపై ఉన్న కల్వర్టుపై చిక్కుకున్నారు. వరద తీవ్రత ఎక్కువ కావడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారు.
* రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్కు చెందిన పెరుమాండ్ల దేవయ్య(55) పాతబస్టాండ్ సమీపంలో పైకప్పు లేని మ్యాన్హోల్లో జారిపడి గల్లంతయ్యాడు. పోలీసులతో పాటు సహాయక బృందాలు వెతుకుతున్నాయి.
* కామారెడ్డి జిల్లాలోని గర్గుల్లో ఇంటి గోడ కూలి నిమ్మ నర్సవ్వ అనే వృద్ధురాలు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి, చిన్నమావంది శివారులోని పసుపువాగులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకుపోయింది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ పంచాయతీ పరిధిలోని కన్నయ్యతండాలో పొలానికి వెళ్లిన అష్రద్ అనే రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
* నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం టెంబుర్నిలో గుమ్ముల నరేశ్(30) అనే జాలరి గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.
* సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి-గుడాటిపల్లి గ్రామాల మధ్యన ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించిన రంగు కిష్టస్వామి (45) ప్రాణాలు కోల్పోయాడు. ఇదే జిల్లా మల్లంపల్లిలో ద్విచక్ర వాహనంపై వాగును దాటేందుకు ప్రయత్నించిన కామాద్రి వెంకటయ్య నీటిలో కొట్టుకుపోతుండగా గ్రామస్థులు కాపాడారు.
* కరీంనగర్ జిల్లా జమ్మికుంట కల్వర్టు వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మల్ల రాజయ్య అనే వ్యక్తిని స్థానికులు కాపాడారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గోదావరి నది మధ్యలో దిబ్బపై ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. మేడిపల్లి మండలం పోరుమల్ల సమీపంలో వరదలో కారు చిక్కుకోగా.. అందులోని వ్యక్తిని స్థానికులు కాపాడారు.
* జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాజస్థాన్కు చెందిన ముగ్గురు యువకులు బాబీ, జితే, హామరు పెగ్గెర్ల వద్ద ఉన్న లోతట్టు వంతెన దాటుతున్న క్రమంలో చెరువులో కొట్టుకుపోయి చెట్ల పొదల్లో చిక్కుకున్నారు. స్థానిక యువకులు వారిని కాపాడారు.
ఐదు జిల్లాల్లో బడుల మూత
ఈనాడు, హైదరాబాద్: కుండపోత వర్షాల నేపథ్యంలో మంగళవారం అయిదు జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం బడులు తెరవలేదని విద్యాశాఖ వెల్లడించింది.
దెబ్బతిన్న ఎల్లంపల్లి పైపులు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి శివారులో ఎల్లంపల్లి జలాశయం పైపులైన్లు దెబ్బతిన్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి పైపులైన్ల దిగువన వర్షం నీరు చేరడంతో 200 మీటర్ల మేర పైపులు దాదాపు మీటరున్నర పైకి లేచాయి.
రికార్డు కుంభవృష్టి
ఈనాడు, హైదరాబాద్: కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలకు పాత ‘రికార్డులు’ కొట్టుకుపోతున్నాయి. గత 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం తాజాగా నమోదైంది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ (4 గంటల వ్యవధిలో) అత్యధికంగా హనుమకొండ జిల్లా నడికూడలో 38.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 120 ఏళ్ల వాతావరణ రికార్డులను పరిశీలిస్తే.. 1983 అక్టోబరు 6న నిజామామాద్లో 24 గంటల వ్యవధిలో నమోదైన 35.5 సెం.మీ. వర్షపాతమే అత్యధికం కాగా.. తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. నడికూడలో సరికొత్త రికార్డు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 ప్రాంతాల్లో 20 నుంచి 38.8 సెం.మీ.ల దాకా వర్షం కురవడంతో వరదలా నీరు పోటెత్తింది.
వాహనాలు వరద పాలు
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు