Lakhimpur Kheri Violence: ఎట్టకేలకు ఆశిష్ మిశ్ర అరెస్ట్
కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రను ఉత్తర్ప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఎనిమిది మంది మృతికి కారణమైన లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో విచారణ నిమిత్తం శనివారం ....
లఖింపుర్ ఖేరి కేసులో సిట్ విచారణకు హాజరు
లఖింపుర్ ఖేరి, దిల్లీ, ఈనాడు-లఖ్నవూ: కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రను ఉత్తర్ప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఎనిమిది మంది మృతికి కారణమైన లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో విచారణ నిమిత్తం శనివారం ఉదయం ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు. లఖింపుర్లోని క్రైం బ్రాంచ్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఘటన అనంతరం కనిపించకుండా పోయిన ఆశిష్, మళ్లీ బయటకు రావడం ఇదే తొలిసారి! ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకూ కొనసాగింది. నిందితుని సమాధానాలతో సంతృప్తి చెందని సిట్ అధికారులు... 11 గంటల విచారణ తరువాత ఆయన్ను అరెస్టు చేశారు. ఆదివారం న్యాయస్థానాలకు సెలవు కావడంతో, నిందితునికి వైద్య పరీక్షలు పూర్తిచేసి ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశముందని చెబుతున్నారు. గత ఆదివారం ఘటన జరిగిన సమయంలో తాను ఎక్కడున్నదీ ఆశిష్ చెప్పలేకపోయారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విచారణ నిమిత్తం ఆయన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి.
సీజేఐ విచారణ నేపథ్యంలో...
హింసాత్మక ఘటనలో నిందితుడిని ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేదని, దయచేసి విచారణకు రండి అని ఆయనకు నోటీసులు ఇవ్వడమేంటని శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా కేసుల్లోని నిందితులతోనూ ఇలాగే వ్యవహరిస్తారా అంటూ యూపీ పోలీసులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలో సిట్ ఎదుట ఆశిష్ హాజరుకావడం గమనార్హం. విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడి తండ్రి అజయ్ మిశ్ర తన స్థానిక కార్యాలయంలో న్యాయవాదులతో మంతనాలు సాగించారు. ఘటన జరిగిన సమయంలో తాను, తన కుమారుడు అక్కడ లేమని ఆయన చెబుతున్నా, రైతులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. సహాయమంత్రి కుమారుడు, అనుచరులు గత ఆదివారం స్వయంగా వాహనాలను నడుపుతూ తమపైకి దూసుకొచ్చినట్టు చెబుతున్నారు.
కాంగ్రెస్ యువజన విభాగం నిరసన..
లఖింపుర్ ఘటనకు నిరసనగా దిల్లీలో కాంగ్రెస్ యువజన విభాగం కార్యకర్తలు నిరసనకు దిగారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆదివారం వారణాసిలో జరిగే ‘కిసాన్ న్యాయర్యాలీ’లో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆశిష్ను అరెస్టు చేయాలంటూ రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ శనివారం విరమించారు.
వారికి అండగా ఉంటాం: అఖిలేశ్
యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, లఖింపుర్ ఖేరి ఘటనతో రైతులతో పాటు రాజ్యాంగం కూడా భాజపా చక్రాల కింద నలిగిపోతోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బాధిత రైతు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM