Rains in Kerala: 10 జలాశయాలకు రెడ్ అలర్ట్
కేరళలో జల విలయం కొనసాగుతోంది! ప్రస్తుతానికి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 10 డ్యాంలకు సంబంధించి రెడ్ అలర్ట్లు జారీ
కేరళలో ఆందోళనకర పరిస్థితులు
రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు!
శబరిమలకు భక్తుల నిలిపివేత
పథనంతిట్ట: కేరళలో జల విలయం కొనసాగుతోంది! ప్రస్తుతానికి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 10 డ్యాంలకు సంబంధించి రెడ్ అలర్ట్లు జారీ అయ్యాయి. కక్కి డ్యాంలో రెండు షట్టర్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తాజా భయాందోళనల నేపథ్యంలో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు కేరళలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కేరళలో తాజా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం పథనంతిట్టలో సమీక్ష నిర్వహించింది. ఈ నెల 20-24 తేదీల మధ్య భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో.. తులా మాసం పూజల కోసం శబరిమల ఆలయానికి భక్తులను అనుమతించడం ప్రస్తుతానికి సాధ్యపడదని పేర్కొన్నారు. కేరళలో తాజాగా కొండచరియలు విరిగిపడటం, వరదల వంటి ఘటనల్లో మృత్యువాతపడ్డ వారి సంఖ్య 27కు పెరిగింది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో మొత్తంగా 38 మంది వర్షాల సంబంధిత ఘటనల్లో దుర్మరణం పాలయ్యారు.
కళ్ల ముందే కొట్టుకుపోయిన ఇల్లు
కేరళలో వర్ష బీభత్సం ధాటికి వేలమంది నిరాశ్రయులయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో, వరదలు ముంచెత్తడంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్క కొట్టాయం జిల్లాలోనే 62 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందకయం పట్టణంలో ప్రైవేటు బస్ డ్రైవర్గా పనిచేసే జేబి అనే వ్యక్తి ఇల్లు కళ్ల ముందే మణిమాల నది వరదలో కొట్టుకుపోవడం అక్కడి తాజా విలయానికి నిదర్శనం. తన 27 ఏళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారిందంటూ జేబి కన్నీరుమున్నీరయ్యారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, తమిళనాడు, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది.
ఉత్తరాఖండ్లో ఐదుగురి మృత్యువాత
ఉత్తరాఖండ్ను 2 రోజులుగా వర్షాలు వణికిస్తున్నాయి. పౌరి జిల్లాలోని సమ్ఖాల్ ప్రాంతంలో వానల ధాటికి ఎత్తయిన ప్రాంతం నుంచి రాళ్లు, మట్టి కూలిపోవడంతో.. ముగ్గురు నేపాలీ కూలీలు మృత్యువాతపడ్డారు. చంపావట్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిపోయి మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.
వంటపాత్రలో వధూవరులు
వర్షాల ధాటికి విలవిలలాడుతున్న కేరళలో ఓ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. వధూవరులు వంటపాత్రలో కూర్చొని జలమయమైన వీధుల గుండా వివాహ వేదికకు చేరుకోవడమే అందుకు కారణం. అలప్పుజ జిల్లాకు చెందిన ఆకాశ్, ఐశ్వర్య ఆరోగ్య కార్యకర్తలు. సోమవారం వీరి వివాహం భారీ వర్షాల నడుమే జరిగింది. పెద్ద వంటపాత్రలో వీరిని కూర్చోబెట్టి వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్