వైర్లెస్ విద్యుత్తు
వీధుల్లో విద్యుత్ స్తంభాలు, తీగలేవీ లేవు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద కేబుల్ టవర్లేవీ లేవు. అయినా ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగులీనుతూనే ఉన్నాయి. ఫ్రిజ్, ఏసీ వంటివి యథావిధిగా పనిచేస్తూనే ఉన్నాయి. ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
వీధుల్లో విద్యుత్ స్తంభాలు, తీగలేవీ లేవు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద కేబుల్ టవర్లేవీ లేవు. అయినా ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగులీనుతూనే ఉన్నాయి. ఫ్రిజ్, ఏసీ వంటివి యథావిధిగా పనిచేస్తూనే ఉన్నాయి. ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. మరి అదే నిజమైతే? వైర్లెస్ విద్యుత్తు పంపిణీ పరిజ్ఞానంతో ఇది సాకారమయ్యే రోజులు మరెంతో దూరంలో లేవు.
తీగలు లేని విద్యుత్తు అనగానే సైన్స్ ఫిక్షన్ కథ గుర్తుకురావొచ్చు. కానీ ఇదేమీ కాల్పనిక కథ కాదు. ఇది సాధ్యమేనని నిరూపితమైంది. వైర్లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత వాహనాలు, 5జీ వంటి అధునాతన పరికరాలు, పరిజ్ఞానాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వైర్లెస్ విద్యుత్తు ఉత్కంఠ రేపుతోంది. సుస్థిర అభివృద్ధి దిశగా ఈ టెక్నాలజీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇప్పటికే వినియోగం దిశగా బుడిబుడి అడుగులకు సిద్ధమైంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమెరికాకు చెందిన వేవ్ ఇంక్ దగ్గర్నుంచి జపాన్లోని స్పేస్ పవర్ టెక్నాలజీ, న్యూజిలాండ్ ఇంధన అంకుర సంస్థ ఎమ్రాడ్ వరకూ ఎన్నెన్నో సంస్థలు వైర్లెస్ విద్యుత్తు పంపిణీ టెక్నాలజీ దిశగా దృష్టి సారించాయి. కొన్ని చోట్ల క్షేత్రస్థాయి పరీక్షలూ మొదలయ్యాయి. దీన్ని సమర్థంగా, చవకగా, తేలికగా అందుబాటులో ఉండేలా ముందుగా ఎవరు అందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
వందేళ్ల కల
వైర్లెస్ విద్యుత్తు ఇప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు గానీ ఇది వందేళ్ల కల. సెర్బియా-అమెరికా ఆవిష్కర్త నికోలా టెస్లా 1891లోనే దీనికి పునాది వేశారు. విద్యుదయస్కాంత తరంగాల ద్వారా శూన్యంలో ఇంధనాన్ని పంపిణీ చేయొచ్చని జె.మాక్స్వెల్ 1873లోనే ప్రతిపాదించారు. ఇది సిద్ధాంత పరంగా సాధ్యమేనని హెచ్.హెర్ట్జ్ పేర్కొన్నారు. వీరి స్ఫూర్తితోనే టెస్లా ఓ వినూత్నమైన పరిరకరాన్ని రూపొందించారు. దీని పేరు టెస్లా కాయిల్. ఎలక్ట్రికల్ రిసోనాన్స్ (విద్యుత్ సర్క్యూట్లో ఇన్పుట్, అవుట్పుట్ మధ్య అవరోధం దాదాపు సున్నా స్థాయికి చేరుకున్నప్పుడు పుట్టుకొచ్చే విద్యుత్ ప్రతిధ్వని) సిద్ధాంతం మీద ఆధారపడి పని చేస్తుంది. తీగలతో పనిలేకుండా విద్యుత్తును పంపిణీ చేయటం దీని ఉద్దేశం. కాకపోతే ఇది కొద్ది దూరానికే విద్యుత్తును చేరవేసేది. అందువల్ల కార్యరూపం ధరించలేకపోయింది. అయినప్పటికీ టెస్లా తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. వైర్లెస్ విద్యుత్తు అతడి మనసును తొలుస్తూనే ఉండేది. కొద్ది సంవత్సరాలు గడిచాక తీగల్లేకుండా హైవోల్టేజ్ విద్యుత్తును పంపిణీ చేయగల ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయటంపై దృష్టి సారించారు. ఈ ప్రయోగాల ద్వారా దూర ప్రాంతాలకు తీగల్లేకుండా సందేశాలను పంపాలని సంకల్పించారు. ఆకాశంలో బెలూన్లను ఎగరేసి స్థిరంగా ఉండేలా చూడటం లేదా టవర్లను ఏర్పాటు చేయటం ద్వారా దీన్ని సాధించాలని అనుకున్నారు. ఇందుకోసం లాంగ్ ఐలాండ్లో ఒక వైర్లెస్ పంపిణీ కేంద్రాన్నీ నెలకొల్పారు. దూర ప్రాంతాలకు తీగల్లేకుండా విద్యుత్తును పంపిణీ చేయటం సాధ్యమేనని దీని ద్వారా నిరూపించాలన్నది ఆయన ఉద్దేశం. దురదృష్టవశాత్తు- టవర్ పేలిపోవటం, ప్రయోగాల కోసం మరిన్ని నిధులు సమకూర్చటానికి పెట్టుబడి సంస్థ నిరాకరించటంతో టెస్లా ఆశలన్నీ ఆవిరయ్యాయి. దీంతో ప్రాజెక్టు ఆగిపోయింది. చివరికి మూత పడింది.
వైర్లెస్ ఛార్జింగ్ కూడా..
కొన్ని మొబైల్ ఫోన్లు వైర్లెస్గా ఛార్జ్ అవటం చూస్తూనే ఉన్నాం. ఇదీ తీగల్లేకుండా విద్యుత్తును పంపిణీ చేసే విధానమే. వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్, వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్, వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ట్రాన్స్ఫర్.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా దీని ఉద్దేశం ఒకటే. తీగల్లేకుండా విద్యుత్తును పంపిణీ చేయటం. ఈ వ్యవస్థల్లో ఒక ట్రాన్స్మిటర్ పరికరం ఉంటుంది. ఇది విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి, రిసీవర్కు చేరవేస్తుంది. రిసీవర్ విద్యుదయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్తును సంగ్రహించి లైట్లు, ఫ్యాన్ల వంటి పరికరాల్లోని ఎలక్ట్రికల్ లోడ్కు పంపిణీ చేస్తుంది. ఇలా తీగలు, బ్యాటరీలతో పనిలేకుండా విద్యుత్తును పంపిణీ చేస్తుంది.
న్యూజిలాండ్ ప్రయోగం ఆశలు
తీగల్లేకుండా విద్యుత్తును పంపిణీ చేసే దిశగా న్యూజిలాండ్ ప్రయోగం కొత్త ఆశలు రేపుతోంది. ఆ దేశానికి చెందిన ఎమ్రాడ్ కంపెనీ ఇందుకు శ్రీకారం చుట్టింది. యాంటెనాలు, రెక్టెనాల (మార్పు చేసిన యాంటెనాలు) అనుసంధానంతో కూడిన ఇదో ప్రత్యేకమైన విధానం. ఇది విద్యుత్తును దీర్ఘశ్రేణి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేస్తుంది. ఇప్పటికే దీనిపై పరీక్షలు ఆరంభమయ్యాయి. ఇది విజయవంతమైతే ప్రపంచంలో మొట్టమొదటి వైర్లెస్ విద్యుత్తు పంపిణీ విధానంగా రికార్డులకు ఎక్కుతుందని ఆశిస్తున్నారు.
మరికొన్ని వినూత్న పద్ధతులు
* అమెరికాకు చెందిన వైర్లెస్ అడ్వాన్స్డ్ వెహికిల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కొత్త వ్యవస్థలను రూపొందించింది. ఇవి భూమి లోపల, రోడ్ల కిందే ఉంటాయి. వీటి మీదికి వాహనాలు వచ్చి నిలువగానే వైర్లెస్గా ఛార్జింగ్ చేస్తాయి. ఇవి ఒక మెగావాట్ వరకు విద్యుత్తును పంపిణీ చేయగలవు.
* ఇండియానా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరో అడుగు ముందుకేసింది. పర్డ్యూ యూనివర్సిటీ, జర్మనీకి చెందిన మాగ్మెంట్ సిమెంట్ కంపెనీతో కలిసి అయస్కాంత సిమెంటు రోడ్ల మీద పరీక్షలు చేపట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు కదులుతుండగానే ఛార్జింగ్ చేయటం ఈ రోడ్ల ప్రత్యేకత.
* విట్రిసిటీ అనే అమెరికా సంస్థ పార్క్ అండ్ ఛార్జ్ టెక్నాలజీ మీద పనిచేస్తోంది. దీని ఉద్దేశం- ఎలక్ట్రిక్ వాహనాలను నిలిపిన చోట అయస్కాంత ప్రతిధ్వని పరికరాలతో ఛార్జ్ చేయటం.
ఎన్నెన్నో పద్ధతులు
వైర్లెస్ విద్యుత్తు కల సాకారం కాకుండానే నికోలా టెస్లా 1943లో మరణించినప్పటికీ ఆయన భావన సమసిపోలేదు. అప్పట్నుంచీ ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు దీనిపై ప్రయోగాలు, పరీక్షలు, అధ్యయనాలు చేస్తూనే వస్తున్నారు. ఆయన భావన సరైనదేనని, తీగల్లేకుండా విద్యుత్తును పంపిణీ చేయటం సాధ్యమేనని నిరూపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో కొత్త పద్ధతులను రూపుదిద్దుకున్నాయి. వాటిల్లో కొన్ని ఇవీ..
సౌర ఉపగ్రహ పంపిణీ
సౌర విద్యుత్తు ఉపగ్రహాలను భూ పై కక్ష్యలో ప్రవేశపెట్టి, వాటి నుంచి విద్యుత్తును పంపిణీ చేయటం దీనిలోకి కీలంకాశం. ఉపగ్రహం సూర్యరశ్మిని ఇంధనంగా మారుస్తుంది. ఈ ఇంధనం మైక్రో వేవ్స్ రూపంలో ఉంటుంది. మైక్రో వేవ్స్ సంకేతాలు భూమి మీదుండే యాంటెనా లేదా ప్రధాన గ్రిడ్ కేంద్రానికి చేరుకుంటాయి. అక్కడ్నుంచి ఉప గ్రిడ్ కేంద్రానికి పంపిణీ అవుతాయి. అనంతరం మైక్రోవేవ్స్ డీసీ విద్యుత్తుగా మారతాయి. గ్రిడ్ కేంద్రాల్లో విద్యుత్తు ఇంటర్నెట్ డేటా ప్యాకెట్ల మాదిరిగా ఇంధన ప్యాకెట్ల రూపంలోకీ మారుతుంది. ఇవి ఇళ్లకు పంపిణీ అయ్యాక ఎనర్జీ రీసీవర్లో నిల్వ అవుతాయి. ఈ దిశగా కాల్టెక్ అనే సంస్థ స్పేస్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దీని ద్వారా భూమ్మీద ఎక్కడికైనా విద్యుత్తును పంపిణీ చేయాలని సంకల్పించింది. బియాండ్ అనే స్వచ్ఛంద సంస్థ సైతం సౌర ఉపగ్రహ విద్యుత్తు పంపిణీ వ్యవస్థ మీద దృష్టి సారించింది. దీని ద్వారా పరిశ్రమలు, ఇళ్లకే కాదు.. మున్ముందు చంద్రుడి మీద విద్యుత్తు అవసరాలనూ తీర్చాలని భావిస్తోంది.
మైక్రోవేవ్ పవర్ ట్రాన్స్మిషన్
ఇందులో మైక్రోవేవ్ రిసీవర్, డీసీ రెక్టిఫయర్ సాయంతో మైక్రోవేవ్ రేడియేషన్ను డీసీ విద్యుత్తుగా మారుస్తారు. దీని ద్వారా అత్యధికంగా 84% వరకు విద్యుత్తును పంపిణీ చేయొచ్చు. జపాన్ శాస్త్రవేత్తలు 1975లోనే దీన్ని సాధించి నిరూపించారు. కాకపోతే ఎక్కువ విద్యుత్తును సరఫరా చేసే వ్యవస్థల సామర్థ్యం తగ్గటం ఒక్కటే లోపం. ఇప్పుడు దూర ప్రాంతాలకు అధిక సామర్థ్యంతో విద్యుత్తును పంపిణీ చేసే దిశగా కృషి చేస్తున్నారు. రాకెట్లను అంతరిక్షంలోకి ప్రయోగించటానికి అధిక శక్తితో కూడిన మైక్రోవేవ్ రేడియేషన్ సమర్థమైన వైర్లెస్ ఇంధన వనరుగా ఉపయోగపడగలదనీ జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ సుకుబా ఇటీవల ప్రచురించిన పరిశోధన పత్రం పేర్కొంటోంది. రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు ఇంధనమే సుమారు 90% బరువు కలిగుంటుంది. మైక్రోవేవ్ ఆధారిత వైర్లెస్ ఇంధన టెక్నాలజీతో దీన్ని పూర్తిగా తగ్గించే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు.
లేజర్ పంపిణీ
డీసీ విద్యుత్తును లేజర్ పుంజంగా మార్చి ఆప్టిక్ ఫైబర్ ద్వారా పంపిణీ చేయటం మరో పద్ధతి. దీన్ని పవర్ బీమింగ్ అనీ అంటారు. ఎందుకంటే ఇందులో ముందుగా విద్యుత్తు లేజర్ రూపంలో ఫొటోవోల్టాయిక్ రిసీవర్కు చేరుకుంటుంది. దీనిలోని ప్రత్యేకమైన కన్వర్టర్లు లేజర్ను తిరిగి విద్యుత్తుగా మారుస్తాయి. లేజర్ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను తొలిసారిగా 2018లో ప్రదర్శించారు. ఇది గదిలో స్థిరంగా ఉన్న, కదులుతున్న పరికరాలకూ విద్యుత్తును చేరవేయటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్జీపీటీ
ఛాట్జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
ఎక్స్లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో.
తాజా వార్తలు (Latest News)
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం