బ్లూటూత్ కథ
ప్రస్తుతం అంతా బ్లూటూత్ పరిజ్ఞానాన్ని వాడుతున్నవారే. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్ల వంటివన్నీ దీంతో కూడుకున్నవే. హెడ్సెట్, స్మార్ట్వాచ్ పరికరాలు బ్లూటూత్తో అనుసంధానమై
ప్రస్తుతం అంతా బ్లూటూత్ పరిజ్ఞానాన్ని వాడుతున్నవారే. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్ల వంటివన్నీ దీంతో కూడుకున్నవే. హెడ్సెట్, స్మార్ట్వాచ్ పరికరాలు బ్లూటూత్తో అనుసంధానమై పనిచేసేవే. వీటితో పాటలు వినటం, ఆరోగ్య వివరాలను ఓ కంట కనిపెట్టటం లాంటి పనులన్నీ సులభంగా కానిచ్చేస్తుంటాం. కానీ రేడియేషన్ గురించిన భయాలు మదిలో మెదులుతూనే ఉంటాయి. బ్లూటూత్ పరికరాలు సురక్షితమేనా? అన్న సందేహం తొలుస్తూనే ఉంటుంది. ఇంతకీ బ్లూటూత్ అంటే ఏంటి?
వైర్లెస్ పరికరాల వాడకం తేలిక. తీగలతో అవసరం లేకుండా ఎంచక్కా వాడుకోవచ్చు. ఇవి వైఫై, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్.. ఇలా మూడు రకాలుగా ఒకదాంతో మరోటి అనుసంధానం అవుతాయి. వీటిల్లో మొదట్నుంచీ ప్రాచుర్యం పొందింది బ్లూటూతే. దీంతో అనుసంధానమయ్యే పరికరాల్లోని చిప్లు బ్లూటూత్ మాడ్యూల్తో కూడుకొని ఉంటాయి. ఇలాంటి మాడ్యూల్తో కూడిన మరో పరికరంలోని చిప్తో అనుసంధానమై సమాచార మార్పిడికి తోడ్పడతాయి. ఎరిక్సన్ కంపెనీ ఎలక్ట్రికల్ ఇంజినీర్ జాప్ హార్ట్సెన్ 1994లో బ్లూటూత్ను ఆవిష్కరించారు. అనంతరం కొందరు ఇంజినీర్లు కలిసి మెరుగుపరచారు. ఇంటెల్ ఉద్యోగి ఒకరు దీనికి బ్లూటూత్ అని పేరుపెట్టారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలతో కూడిన బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) దీని ప్రమాణాలు, అభివృద్ధి, లైసెన్స్ వంటి వాటిని పర్యవేక్షిస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
బ్లూటూత్ 2.4 జీహెచ్జెడ్ రేడియో తరంగాల మీద పనిచేస్తుంది. ఇది ఫ్రీక్వెన్సీ హాంపింగ్ అనే అధునాతన పద్ధతిని వినియోగించుకుంటుంది. తేలికగా చెప్పాలంటే- 79 బ్యాండ్ రేడియో తరంగాలతో పనిచేస్తుందన్నమాట. బ్లూటూత్ పంపే సమాచారం ముందుగా చిన్న ‘ప్యాకెట్లు’గా విడిపోతుంది. తర్వాత ఈ ప్యాకెట్లు ఒక బ్యాండు మీద నుంచి మరో బ్యాండ్ మీదికి దూకుతూ సమాచారాన్ని చేరవేస్తాయి. ఈ ప్రక్రియ చాలావరకు చిన్న సమాచారం పంపిణీకే ఉపయోగపడుతుంది. దీనికి అంత వేగం అవసరం ఉండదు. బ్లూటూత్ 5 అయితే 2 ఎంబీపీఎస్ వేగంతో 40 మీటర్ల దూరంలో ఉన్న పరికరాలకూ సమాచారాన్ని చేరవేయగలదు. చాలామంది సెల్యులర్ డేటాను బ్లూటూత్ వాడుకుంటుందని భావిస్తుంటారు. బ్లూటూత్తో అనుసంధానమయ్యే పరికరాలు వాటి మధ్య పర్సనల్ ఏరియా నెట్వర్క్ (పీఏఎన్) ఏర్పరచుకొని ఫైళ్లను చేరవేస్తుంటాయి. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు.
పరిమితి ఎంత?
మన శరీరం ఎంతవరకు రేడియోఫ్రీక్వెన్సీ శక్తిని గ్రహించుకోగలదనే దాన్ని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్సీసీ) నిర్వచించింది. దీన్నే స్పెసిఫిక్ అబ్జార్బ్డ్ రేట్ (ఎస్ఏఆర్) అంటారు. దీన్ని వాట్స్ పర్ కిలోగ్రామ్ (డబ్ల్యూ/కేజీ) లేదా మిల్లీవాట్స్ పర్ స్క్వయర్ సెంటీమీటర్ (ఎండబ్ల్యూ/సీఎం2) ప్రకారం లెక్కిస్తారు. మన దేశంలో ఫోన్లకు ఎస్ఏఆర్ పరిమితిని గరిష్ఠంగా 1.6 డబ్ల్యూ/కేజీగా నిర్ణయించారు. బ్లూటూత్ ద్వారా అనుసంధానమయ్యే యాపిల్ ఎయిర్పాడ్స్ ఎస్ఏఆర్ విలువ 0.466 డబ్ల్యూ/కేజీ. నిజానికి మొబైల్ ఫోన్ల కన్నా ఎయిర్పాడ్స్ ద్వారా కాల్స్ మాట్లాడటమే సురక్షితం. చాలా పరికరాల్లోని సెటింగ్స్లో ఎస్ఏఆర్ విలువ ఎంతనేది కనిపిస్తుంది. ఐఫోన్లు, ఐప్యాడ్స్లోనైతే సెటింగ్స్లో జనరల్లోకి వెళ్లాలి. అక్కడ్నుంచి లీగల్ అండ్ రెగ్యులేటరీ ద్వారా ఆర్ఎఫ్ ఎక్స్పోజర్లోకి వెళ్లి ఎస్ఏఆర్ విలువ తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లోనైతే *#07# కి డయల్ చేసి తెలుసుకోవచ్చు.
రేడియేషన్ భయం
బ్లూటూత్ వాడకం ప్రమాదకరమని చాలామంది భావిస్తుంటారు. ఇది విద్యుదయస్కాంత (ఎలక్ట్రోమాగ్నెటిక్) రేడియేషన్ను (ఈఎంఆర్) వినియోగించుకుంటుంది. ఈఎంఆర్ అనేది ఒకరకమైన శక్తి. ఇది మన చుట్టుపక్కలంతా విస్తరించి ఉంటుంది. కృత్రిమ, సహజ వస్తువుల నుంచి వివిధ స్థాయుల్లో ఎంతోకొంత విడుదల అవుతూనే ఉంటుంది. ఇందులో అయోనైజింగ్, నాన్-అయోనైజింగ్ అని రెండు రకాలున్నాయి. అయోనైజింగ్ ఈఎంఆర్ కణాలు, డీఎన్ఏను దెబ్బతీసే అవకాశముంది. సూర్యరశ్మి, ఎక్స్రే యంత్రాలు, రేడియోధార్మిక వ్యర్థాల వంటి వాటి నుంచి ఇది విడుదలవుతుంది. అదే స్వల్ప పౌనఃపున్యంతో కూడిన నాన్-అయోనైజింగ్ ఈఎంఆర్ సాధారణంగా మనుషులకు ఎలాంటి హాని చేయదు. బ్లూటూత్ పరికరాలు, సెల్ఫోన్లు, కంప్యూటర్లు, వైఫై నెట్వర్క్లు, మైక్రోవేవ్లు, ఎంఆర్ఐ యంత్రాల నుంచి వెలువడేదీ ఇలాంటి రేడియేషనే. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం- తక్కువ శక్తితో కూడిన నాన్-అయోనైజింగ్ ఈఎంఆర్ మనకు హాని చేయదు. ఇది శరీరానికి చేసే అనర్థం ఒక్కటే. అది వేడి చేయటం. అదీ అంత ఎక్కువగా ఏమీ ఉండదు. రసాయన బంధాలు, ఎలక్ట్రాన్లను విడదీసేంత శక్తి దీనికి లేదు.
భద్రతే ప్రధానం
చెవి నుంచి ఫోన్ను కనీసం సెంటీమీటర్ దూరంలో పెట్టి మాట్లాడటం మంచిది. పిల్లల చేతికి మొబైల్ ఫోన్లను ఇవ్వకపోవటమే ఉత్తమం. ఒకవేళ ఇస్తే ఎక్కువసేపు వాడకుండా చూసుకోవాలి. బ్లూటూత్ పరికరంలో ఎస్ఏఆర్ విలువ ఎంత ఉందో చూసుకోవటం మంచిది. ఒకవేళ పరికరంలో దీని విలువ కనిపించకపోతే అలాంటి పరికరాలను కొనొద్దు. అన్నింటికన్నా భద్రతే ప్రధానమని తెలుసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్జీపీటీ
ఛాట్జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
ఎక్స్లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ