November Smart Phones: నవంబర్లో వచ్చే నయా స్మార్ట్ఫోన్స్ ఇవే..!
ఎప్పటిలాగే నవంబర్ నెలలో కూడా అదిరే ఫీచర్స్తో.. మరిన్ని ప్రత్యేకతలు, అప్డేట్లతో కొత్త మొబైల్స్ మార్కెట్లోకి రానున్నాయి. ఆ జాబితాలో ఆసుస్ 8z, రెడ్మీ నోట్ 11 సిరీస్, పోకో M4 & M4 ప్రో, జియోఫోన్ నెక్స్ట్ తదితర ఫోన్లు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలేంటో.. చూసేయండి
ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ ప్రియులను అలరించేందుకు మరిన్ని స్మార్ట్ఫోన్లు (Smartphones) రాబోతున్నాయి. గత పది నెలల్లో అదిరిపోయే ఫోన్లు రిలీజ్ అయ్యాయి. బేసిక్, బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్ ఇలా వివిధ విభాగాల్లో వచ్చిన స్మార్ట్ ఫోన్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఒక రేంజ్ అనుకుంటే.. వాటిని మించి మరిన్ని ప్రత్యేకతలతో నవంబర్ నెలలో కొత్త మొబైల్స్ (November Smartphones) మార్కెట్లోకి సందడి చేయనున్నాయి. అవేంటో ఓసారి చూసేయండి!
నెలాఖరున వస్తుందట...
హైఎండ్ రేంజ్లో మంచి స్పెసిఫికేషన్స్ కోసం ఎదురుచూసేవారికి ఆసుస్ కొత్త ఫోన్ తీసుకురాబోతోంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఆసుస్ 8z అందుబాటులోకి రానుంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందువైపు 12 ఎంపీ కెమెరా.. వెనుకవైపు రెండు కెమెరాలుంటాయి. అందులో ఒకటి 64 ఎంపీ వైడ్ కెమెరా కాగా.. మరొకటి 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా. క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఇస్తున్నారు. ధర ₹62,205 ఉండనుంది. నవంబర్ 30న విడుదల చేయనున్నట్లు సమచారం.
రెడ్మీ నుంచి మూడు...
భారత్లో రెడ్మీ (Redmi) నుంచి కొత్త ఫోన్లు వస్తున్నాయంటే చాలు.. ఆ ఫోన్ల ప్రత్యేకతలు తెలుసుకొని తీరాల్సిందే అన్నట్టుగా ఎదురుచూస్తుంటారు టెక్ గురూలు. అంతే స్పీడ్లో నచ్చితే కొనేస్తారు కూడా. ఈసారి రెడ్మీ నోట్ సిరీస్ (Redmi Note 11 Series) నుంచి మూడు కొత్త ఫోన్లు (రెడ్మీ నోట్ 11, నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్) రాబోతున్నాయి. నోట్ 11 సిరీస్ ఫోన్లన్నీ క్వాడ్ కెమెరాతో, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటాయి. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సల్స్ ఉంటుంది. 5జీ కనెక్టివిటీతో పాటు బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్టు చేస్తాయి. ఈ ఫోన్లు చైనాలో అక్టోబర్ 28న విడుదల చేస్తుండగా.. భారత్లో నవంబర్ చివర్లో రానున్నట్లు తెలుస్తోంది. వీటి ధర ₹14,000 నుంచి ₹25,700 వరకు ఉంటుందని అంచనా.
షావోమి 11 సిరీస్లో...
షావోమి (Xiaomi) త్వరలో మరో కొత్త మోడల్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. షావోమి 11టీ (Xiaomi 11T) పేరుతో తీసుకొస్తున్న ఈ మోడల్ను రెండు వేరియంట్లలో పరిచయం చేయనుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, 108 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ రానుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తోపాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది. నవంబర్ రెండు, మూడు వారాల్లో ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నాయి.
పోకో నుంచీ రెండే...
పోకో నుంచి వచ్చే M సిరీస్ (POCO M Series) ఫోన్లు నవంబర్ మొదటి వారంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో 5జీ నెట్వర్క్ సపోర్టు ఉండనుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో రెండు వేరియంట్లలో ఈ ఫోన్లు లభించనున్నాయి. వెనుకవైపు క్వాడ్ కెమెరాతో పాటు, ముందువైపు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ ఉండనుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఇవ్వనున్నారు. ప్రారంభ ధర ₹15,990 నుంచి ఉండొచ్చని సమాచారం. బడ్జెట్లో మంచి ఫీచర్స్ కోసం ఎదురుచూసే వినియోగదారులకు ఈ మొబైల్ బాగుంటుందని టెక్ నిపుణులు అభిప్రాయం.
‘ప్రగతి’ ఓఎస్తో...
ఇది దీపావళికి ముందే జియో ఫోన్ నెక్ట్స్ (JioPhone Next) మార్కెట్లోకి రావొచ్చని అంచనా. 2జీ నుంచి 4జీ స్మార్ట్ ఫోన్వైపు మళ్లే వారికి బడ్జెట్ రేంజ్లో ఇది ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కోసం జియో ప్లాట్ఫామ్స్, గూగుల్ సంయుక్తంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేశాయి. వెనుక, ముందు రెండు వైపులా 13 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ రానుంది. దీని ధర ₹3 వేల నుంచి ₹4 వేలు వరకు ఉంటుందని తెలుస్తోంది. 5.45 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. 2జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్ వెర్షన్స్... స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్ ఉండొచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
వన్ప్లస్ 9 సిరీస్లో...
వన్ప్లస్ (Oneplus) నుంచి ఈ సారి 9RT (Oneplus 9RT) ఫోన్ సందడి చేయనుంది. ఈ ఫోన్ ధర ₹39వేల నుంచి ప్రారంభం కానుంది. క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో పనిచేస్తుంది. వెనుకవైపున ట్రిపుల్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉండనుంది. ఈఫోన్కు ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే.. మల్టీ టాస్కింగ్, మెమరీ మేనేజ్మెంట్ కోసం 7జీబీ వర్చువల్ ర్యామ్ (Virtual RAM)ను ఇవ్వనున్నారు. నవంబర్ మధ్యలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐకూ కొత్త మొబైల్స్
ఐకూ 8, 8 లెజెండ్ (iQOO 8 Series) పేరుతో ఐకూ రెండు కొత్త మొబైల్స్ను నవంబర్ చివర్లో భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చైనాలో విడుదలైన ‘ఐకూ 8 ప్రో’ను భారత్లో ఐకూ 8 లెజెండ్గా తీసుకొస్తున్నారు. ప్రధాన కెమెరా 48ఎంపీ మెగాపిక్సల్తో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందువైపు 24 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్ ఉండొచ్చు. 6.76 అంగుళాల 2K OLED డిస్ప్లేతో రానుంది. 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగించారు. ఐకూ 8 ధర ₹40 వేలుపైగా ఉండొచ్చు. ఇక ఐకూ లెజెండ్ ధర అయితే ₹50 వేలకుపైగా ఉండొచ్చని సమాచారం.
శాంసంగ్, ఒప్పొ, వివో నుంచి నవంబర్ నెలలో కొత్తగా ఎలాంటి ఫోన్లూ రావడం లేదని సమాచారం. మైక్రోమాక్స్, లావా నుంచి కొత్త ఫోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలుస్తాయి.
గమనిక: ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు నవంబర్లో రాబోయే స్మార్ట్ఫోన్లను ఇక్కడ ఇచ్చాం. ఇవి కాకుండా మరికొన్ని మొబైల్స్ మార్కెట్లోకి రావొచ్చు. అలానే పైఫోన్లలోని స్పెసిఫికేషన్స్, ధరల్లో మార్పులు ఉండొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్టాప్లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్వర్డ్ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్వర్డ్లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్ను అమ్ముతున్నారా?
ప్రింటర్తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్బాట్స్ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్తో పీడీఎఫ్లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!