IND vs SA : దూకుడులో తగ్గేదేలే.. బవుమాతో విరాట్కోహ్లీ స్వల్ప వాగ్వాదం
విరాట్ కోహ్లీ సారథిగా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. మైదానంలో సహచరులను..
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ సారథిగా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. మైదానంలో సహచరులను ప్రోత్సహిస్తూ చురుగ్గా వ్యవహరిస్తుంటాడు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అందులోనూ అర్ధశతకం సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ లేకపోయినా మైదానంలో తన దూకుడులో ‘తగ్గేదేలే’ అని నిరూపించాడు ఈ పరుగుల రారాజు. ఇంతకీ అసలేం అయిందంటే...!
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ బుధవారం జరిగింది. త్వరగానే ప్రొటీస్ మూడు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా (110), డస్సెన్ (129*) శతకాలతో ఆదుకున్నారు. అయితే 36వ ఓవర్ను యుజువేంద్ర చాహల్ వేస్తున్న సందర్భంలో కోహ్లీ, టెంబా బవుమా మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. చాహల్ వేసిన బంతిని బవుమా కొట్టగా మిడాన్లో ఉన్న కోహ్లీ ఒడిసి పట్టుకున్నాడు. వెంటనే కీపర్కు బాల్ను త్రో చేశాడు. అయితే బంతి బవుమా పైనుంచి వెళ్లింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకున్నారు. కొద్దిసేపటికే వివాదం సద్దుమణిగింది. దక్షిణాఫ్రికా 296 పరుగులు చేయగా.. భారత్ 265 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా