Virat Kohli: వామిక ఫొటో వైరల్ కావడంపై స్పందించిన విరుష్క... ఏమన్నారంటే?
ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్ చివరి వన్డే సందర్భంగా..విరాట్ కోహ్లీ, అనుష్కల కుమార్తె వామిక కెమెరాల కంట పడింది.
దిల్లీ: ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్ చివరి వన్డే సందర్భంగా.. విరాట్ కోహ్లీ, అనుష్కల కుమార్తె వామిక కెమెరాల కంట పడింది. దాంతో వెనువెంటనే ఆ చిత్రాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. వామిక జన్మించి ఏడాది పూర్తైనా కోహ్లీ జంట తమ కుమార్తె ఫొటోలు, వీడియోలు ఇంతవరకు బయటపెట్టలేదు. తమ బిడ్డ విషయంలో గోప్యత పాటించాలనుకుంటున్నట్లు వారు గతంలోనే కోరారు. కానీ, ఇప్పుడు పాపకు సంబంధించిన స్క్రీన్షాట్స్ వైరల్ కావడంపై వారు ఇన్స్టాగ్రామ్లో స్పందించారు.
‘స్టేడియంలో తీసిన మా పాప చిత్రాలు విపరీతంగా షేర్ అయ్యాయని తెలిసింది. ఇలా జరుగుతుందని మేము ఊహించలేకపోయాం. ఆ సమయంలో కెమెరాలు మా వైపు ఉన్నాయని తెలియదు. వామిక గోప్యత విషయంలో ఇప్పటికీ మా వైఖరి, అభ్యర్థనలో ఎటువంటి మార్పులేదు. మా విజ్ఞప్తిని గౌరవించి వామిక ఫొటోలు ప్రచురించని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పోస్ట్లో రాసుకొచ్చారు విరుష్క.
ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్లో కోహ్లీ అర్ధశతకం సాధించాడు. అర్ధ శతకాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చేతిలో బ్యాటు పెట్టుకొని బిడ్డను ఆడించినట్లు చేతులూపాడు. అప్పుడే అనుష్క తన చేతుల్లో ఉన్న వామికకు తండ్రిని చూపిస్తూ.. చప్పట్లు కొట్టింది. కాసేపటికి వామిక కూడా చప్పట్లు కొట్టింది. ఈ మొత్తం దృశ్యం టీవీ లైవ్లో అందరికీ కనిపించింది. దీంతో వామిక తొలి ఫొటో అంటూ ఆ వీడియో స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై విరుష్క అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామిక ఫొటో ఉన్న ట్వీట్లను తొలగించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.