Kohli : కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం.. భారత్కుపెద్ద ఎదురుదెబ్బ : హర్భజన్ సింగ్
విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ముగింపు పలకడం టీమ్ఇండియాకు ఎదురుదెబ్బని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కోహ్లీ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో క్రికెట్ అభిమానులు షాక్కి గురయ్యారని...
ఇంటర్నెట్ డెస్క్ : విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ముగింపు పలకడం టీమ్ఇండియాకు ఎదురుదెబ్బని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కోహ్లీ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో క్రికెట్ అభిమానులు షాక్కి గురయ్యారని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం కోహ్లీ కెప్టెన్సీకి ముగింపు పలికిన విషయం తెలిసిందే. దీంతో అతడు అన్ని ఫార్మాట్లలో సారథ్యాన్ని వదులుకొన్నట్లయింది.
‘విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదిలేయడం.. టీమ్ఇండియాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో అతడికే తెలియాలి. కీలక ఆటగాడైన కోహ్లీనే అభద్రతా భావంలో ఉంటే.. మిగిలిన ఆటగాళ్ల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే, దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే అతడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. వన్డే సిరీస్లో భారత్ని దెబ్బ తీసిందనుకుంటున్నాను. ఏదేమైనా దక్షిణాఫ్రికాను సొంత గడ్డపై ఓడించే గొప్ప అవకాశాన్ని టీమ్ఇండియా కోల్పోయింది. మన జట్టు కంటే బలహీనంగా ఉన్న సఫారీ జట్టు చేతిలో దారుణఓటమి మూటగట్టుకొంది. ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకున్నా దక్షిణాఫ్రికా సిరీస్ సాధించిందంటే.. భారత్ ఎలాంటి స్థితిలో ఉందో అంచనా వేయవచ్చు’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
భారీ అంచనాలతో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరిన టీమ్ఇండియా ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. మూడు టెస్టుల సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికాడు. స్వల్ప వ్యవధిలోనే వన్డే సిరీస్లో పాల్గొనడం, అదే సమయంలో కోహ్లీ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం భారత ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీతో.. కేఎల్ రాహుల్ వన్డే సిరీస్కు సారథ్యం వహించాడు. 0-3 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయిన విషయం తెలిసిందే. త్వరలో వెస్టిండీస్తో జరుగనున్న వన్డే సిరీస్కు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్