Kohli-Abd: మన బంధం విడదీయరానిది బ్రదర్.. ‘ఐ లవ్ యూ’: విరాట్ కోహ్లీ
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ ఆటకే....
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ ఆటకే వీడ్కోలు చెబుతున్నట్లు ‘మిస్టర్ 360’ ఇవాళ ప్రకటించాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సహ ఆటగాళ్లు. వీరిద్దరి మధ్య ఆత్మీయ అనుబంధం విడదీయరానిది. దీంతో ఏబీడీ తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘ఈ నిర్ణయం నా మనస్సును ఎంతో గాయపరిచింది. వ్యక్తిగత జీవితం, కుటుంబం కోసం సమయం కేటాయించేందుకు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందేనని అనుకుంటున్నా. ఐ లవ్ యూ బ్రదర్ ఏబీడీ. మన తరంలో నువ్వు అత్యుత్తమ ఆటగాడివి. నేను కలిసిన వారిలో స్ఫూర్తివంతమైన వ్యక్తివి నువ్వే. ఆర్సీబీ కోసం నువ్వు చేసిన, అందించిన సహకార పట్ల ఎప్పుడూ నువ్వు గర్విస్తావని భావిస్తున్నాను బ్రదర్. మన అనుబంధం ఆటలోనే కాదు.. ఎల్లవేళలా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
2004లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన ఏబీ డివిలియర్స్ దాదాపు 14 ఏళ్లపాటు జాతీయ జట్టుకు సేవలందించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే జట్టు అవసరంరీత్యా 2019 వన్డే ప్రపంచకప్కు అందుబాటులో ఉండాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కోరినా.. ఏబీడీ అంగీకరించలేదు. తన స్థానంలో యువకులను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే మరికొంతకాలం టీ20 లీగుల్లో ఆడతానని అప్పుడే వెల్లడించాడు. ఇప్పుడు ఆటకే వీడ్కోలు పలకడంతో ఏబీడీని ఆటగాడిగా కాకుండా వేరే పాత్రలో చూసే అవకాశం ఉండొచ్చు. 2011 నుంచి గత ఐపీఎల్ వరకు ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ జట్టుకు ఆడాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీకి ఎదురు దెబ్బ తగిలినట్లే. మైదానంలో నలువైపులా షాట్లు కొట్టగలిగే ఏబీడీ క్రీజ్లో ఉన్నాడంటే ప్రత్యర్థికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 2011, 2016లో ఆర్సీబీ ఫైనల్కు చేరడంలో కోహ్లీ, ఏబీడీ కీలక పాత్ర పోషించారు. అయితే టైటిల్ను సాధించాలనే కల నెరవేరకుండానే ఏబీడీ ఆటకు వీడ్కోలు చెప్పడం సగటు ఆర్సీబీ జట్టు అభిమానిని బాధ పెట్టే అంశం.
ఏబీడీ సాధించిన గణాంకాలు ఇవే..
* 114 టెస్టుల్లో 8,765 పరుగులు. అందులో 22 శతకాలు, 46 అర్ధశతకాలు. బ్యాటింగ్ సగటు 50.68. అత్యధిక స్కోరు 278 నాటౌట్ (అబుదాబి వేదికగా పాకిస్థాన్పై)
* 228 వన్డేల్లో 25 శతకాలు, 53 అర్ధశతకాలతో 9,577 పరుగులను 53.50 సగటుతో సాధించాడు. అత్యధిక స్కోరు 176 (బంగ్లాదేశ్పై)
* 78 టీ20ల్లో 1,672 పరుగులు. పది అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 26.14. అత్యధిక స్కోరు 79 నాటౌట్ (స్కాట్లాండ్ మీద)
* వన్డేల్లో అత్యధిక వేగవంతమైన అర్ధశతకం: 16 బంతుల్లో (విండీస్పై)
* వన్డేల్లో అత్యధిక వేగవంతమైన శతకం: 31 బంతుల్లో (విండీస్పై)
* ఐపీఎల్: 184 మ్యాచుల్లో 5,162 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలు, 40 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 133 నాటౌట్
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్