Virat Kohli : సఫారీల గడ్డపై విరాట్ కోహ్లీ రికార్డుల పర్వం!
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన క్రికెట్ కెరీర్లో కొత్త అధ్యయాన్ని ఘనంగా ప్రారంభించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో కోహ్లీ (51) అర్ధ శతకంతో రాణించిన విషయం...
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన కెరీర్లో సరికొత్త అధ్యయాన్ని ఘనంగా ప్రారంభించాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ (51) అర్ధ శతకంతో రాణించాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ వదులుకున్న తర్వాత అతడు నమోదు చేసిన తొలి అర్ధ శతకం ఇదే. సారథ్య బాధ్యతలు చేపట్టక ముందు అంటే అక్టోబరు 29, 2016న న్యూజిలాండ్ వన్డే సిరీస్లో పూర్తి స్థాయి బ్యాటర్గా కోహ్లీ చివరిసారిగా అర్ధ శతకం నమోదు చేశాడు. ఐదేళ్ల తర్వాత తాజా సిరీస్లో అతడు చేసిన హాఫ్ సెంచరీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. దక్షిణాఫ్రికాలో చివరగా ఆడిన ఏడు వన్డే మ్యాచుల్లో కోహ్లీకిది ఐదో అర్ధ శతకం కావడం గమనార్హం.
బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. 296 పరుగులు చేసింది. 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా ఆరంభంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ సంయమనంతో ఆడాడు. 60 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికిది 63వ అర్ధ శతకం. ఇదే మ్యాచులో కోహ్లీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. విదేశాల్లో అత్యధిక పరుగులు (5,108) చేసిన భారత ఆటగాడిగా అతడు నిలిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (5,065) రికార్డును బద్దలు కొట్టాడు.
మరోవైపు, దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన మాజీ ఆటగాళ్లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ రికార్డులనూ కోహ్లీ బ్రేక్ చేశాడు. సఫారీల గడ్డపై 1,338 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గంగూలీ (29 మ్యాచుల్లో 1,313 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (36 మ్యాచుల్లో 1,309 పరుగులు) దక్షిణాఫ్రికాలో నెలకొల్పిన రికార్డులను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 57 మ్యాచుల్లో 2,001 పరుగులు చేసి సఫారీ జట్టుపై అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ