IND vs SA: గెలవాల్సిన మ్యాచులను అప్పనంగా అప్పగించేశారు.!
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో టీమ్ఇండియా 0-3 తేడాతో ఘోర పరాజయం పాలుకావడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. సులభంగా గెలవాల్సిన మ్యాచులను కూడా..
ఇంటర్నెట్ డెస్క్ : దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో టీమ్ఇండియా 0-3 తేడాతో ఘోర పరాజయం పాలుకావడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. సులభంగా గెలవాల్సిన మ్యాచులను అప్పనంగా అప్పగించేశారని విమర్శలు గుప్పించారు. బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉందని సూచించారు.
‘భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. కాస్త సహనంతో ఆడి ఉంటే భారత్ కచ్చితంగా విజయం సాధించేది. అంతర్జాతీయ స్థాయిలో మ్యాచులు ఆడుతున్నప్పుడు.. బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాలి. సాధారణ ఆటగాడిలా ఆడితే.. ఇప్పటిలాగే సిరీస్ కోల్పోవాల్సి వస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఒక్క తొలి టెస్టు మినహాయిస్తే.. మిగతా మ్యాచుల్లో స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. సులభంగా గెలవాల్సిన మ్యాచులను కూడా అప్పనంగా అప్పగించేశారు. ఒక్క మ్యాచులో కూడా భారీ భాగస్వామ్యాల్ని నిర్మించలేకపోయారు. గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం కూడా టీమ్ఇండియా ఘోర పరాజయానికి ఓ ప్రధాన కారణం’ అని మాజీ క్రికెటర్ మదన్ లాల్ విమర్శించారు.
‘గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా భారత యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. శ్రీలంకను సొంత గడ్డపైనే ఓడించి సత్తా చాటారు. సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత.. టీమ్ఇండియా పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. అత్యుత్తమ జట్లలో ఒకటైన భారత్.. ఒక్క మ్యాచులో పై చేయి సాధించేందుకు చాలా కష్టపడుతోంది. టీమ్ఇండియా మిడిలార్డర్లో గందరగోళం నెలకొంది. నాలుగో స్థానంలో రిషభ్ పంత్, ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఆరో స్థానంలో వెంకటేశ్ అయ్యర్ లేదా సూర్యకుమార్ యాదవ్లకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, ఆయా స్థానాల్లో ఆడేందుకు వాళ్లు సిద్ధంగా లేరనుకుంటున్నాను. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తొలి వన్డేలో రిషభ్ పంత్ రాణించినా.. మిగతా మ్యాచుల్లో విఫలమయ్యాడు. శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్ అంచనాలను అందుకోలేకపోయారు’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
‘దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా చాలా దారుణంగా ముగించింది. సఫారీల గడ్డపై అత్యంత పేలవ ప్రదర్శనల్లో ఇదొకటిగా మిగిలిపోతుంది. ఈసారి భారత జట్టుకి సమయం కలిసి రాలేదు. బలహీన దక్షిణాఫ్రికా చేతిలో టీమ్ఇండియా ఓడిపోవడం దారుణం’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్