Tokyo Olympics: ఒలింపిక్స్లో భారత్ అథ్లెట్లు ఎలా ఆడారంటే..
ఒలింపిక్స్లో ఆదివారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే, మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో సింధు కాంస్యం గెలవడంతో భారత్కు ఈసారి రెండో పతకం ఖాయమైంది...
టోక్యో: ఒలింపిక్స్లో ఆదివారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే, మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో సింధు కాంస్యం గెలవడంతో భారత్కు ఈసారి రెండో పతకం దక్కింది. మరోవైపు భారత పురుషుల జట్టు బ్రిటన్పై విజయం సాధించడంతో 41 ఏళ్ల తర్వాత సెమీస్కు చేరింది.
రోజు మొత్తం ప్రదర్శన..
గోల్ఫ్: ఈరోజు జరిగిన గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ఈవెంట్లో అనిర్బన్ లాహిరి 42వ స్థానంలో నిలవగా మరో అథ్లెట్ ఉదయన్ మానె 56వ స్థానంలో నిలిచి నిరుత్సాహ పరిచారు.
ఈక్వెస్ట్రియన్: ఈ ఆటలో భారత ఏకైక అభ్యర్థి ఫవాద్ మిర్జా రెండో రౌండ్గా పిలిచే క్రాస్ కంట్రీలో 22వ స్థానంలో నిలిచాడు. శనివారం అతడు తొలి రౌండ్గా పిలిచే డ్రెస్సేజ్లో 28 పెనాల్టీస్తో 9వ స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.
బాక్సింగ్: బాక్సింగ్ సూపర్ హెవీ క్వార్టర్ ఫైనల్స్లో భారత బాక్సర్ సతీశ్ కుమార్ ఓటమిపాలయ్యాడు. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బాఖోదిర్ జలొలోవ్ చేతిలో 0-5 తేడాతో విఫలమయ్యాడు.
బ్యాడ్మింటన్: ఇక బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో పీవీ సింధు విజేతగా నిలిచింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోపై 21-13, 21-15 తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక భారత బ్యాడ్మింటన్ ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది.
హాకీ: భారత పురుషుల హాకీ జట్టు 1980 తర్వాత తొలిసారి సెమీస్ చేరింది. ఈ సాయంత్రం గ్రేట్ బ్రిటన్తో తలపడిన సందర్భంగా 3-1 తేడాతో ఆ జట్టును చిత్తుగా ఓడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434