Tokyo Olympics: జావెలిన్ త్రోలోనూ భారత్కు నిరాశే.. ఆకట్టుకోలేకపోయిన అన్ను రాణి
ఒలింపిక్స్లో మంగళవారం భారత్కు మరో నిరాశే ఎదురైంది. జావెలిన్ త్రో విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించే పోటీల్లో జాతీయ అత్యుత్తమ రికార్డు కలిగిన అథ్లెట్ అన్ను రాణి నిరుత్సాహపర్చింది....
టోక్యో: ఒలింపిక్స్లో మంగళవారం భారత్కు మరో నిరాశే ఎదురైంది. జావెలిన్ త్రో విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించే పోటీల్లో జాతీయ అత్యుత్తమ రికార్డు కలిగిన అథ్లెట్ అన్ను రాణి నిరుత్సాహపర్చింది. ఆమె మూడో ప్రయత్నంలో 54.04 మీటర్ల ప్రదర్శన చేసి క్వాలిఫికేషన్-ఏలో 14వ స్థానంలో నిలిచింది. దాంతో ఆమె మార్చిలో నెలకొల్పిన తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 63.24 మీటర్లు కూడా చేరుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రెండు అర్హత పోటీలు పూర్తయ్యేసరికి ఆమె 29వ స్థానంలో నిలిచింది.
ఇక అన్ను తొలి రెండు ప్రయత్నాల్లో 50.35 మీటర్లు, 53.19 మీటర్ల ప్రదర్శనలతో మరింత తక్కువస్థాయి ప్రదర్శన చేసింది. కాగా, ఈ ఈవెంట్లో ఎవరైనా అథ్లెట్లు 63 మీటర్ల ప్రదర్శన చేస్తే.. వాళ్లు నేరుగా ఫైనల్స్కు దూసుకెళతారు. లేదా ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తుది 12 మందిని ఫైనల్స్కు ఎంపికచేస్తారు. ఈ క్రమంలోనే క్వాలిఫికేషన్-ఏలో పొలాండ్ అథ్లెట్ మారియా అండ్రెజిక్ 65.25 మీటర్ల మేటి ప్రదర్శనతో తొలి ప్రయత్నంలోనే ఫైనల్ బెర్తును ఖరారుచేసుకుంది. మరోవైవు పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా బుధవారం తుదిపోరుకు అర్హత సాధించే పోటీల్లో పాల్గొననున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్