T20 World Cup: టీమ్ఇండియా అభిమానికి ఎందుకంత బాధ?
టీమ్ఇండియా.. పదినెలల క్రితం కఠినమైన ఆస్ట్రేలియా పిచ్లపై ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం అనుభవంలేని ఆటగాళ్లతో చారిత్రక సిరీస్ గెలిచింది...
ఐపీఎల్ బ్యాన్ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు..
వీరులు.. శూరులు.. ధీరులు అంటూ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత జట్టును అందరూ పొగిడేశారు. మీరు కూడా ఇలాంటి మాటలు వినే ఉంటారు. అనే ఉంటారు కూడా. అయితే ఇప్పుడు ఆటలో ప్రదర్శన చూస్తే... ఇన్నాళ్లూ మనం పొగిడింది ఈ జట్టునా, అసలు ఇది మనం చూసిన టీమ్ఇండియా యేనా అని బాధపడుతున్నారు. అసలు ప్రపంచకప్ ముందు కోహ్లీ సేన ఆట ఎలా సాగింది, ఇప్పుడు ఎలా ఉంది, మనవాళ్లు స్థాయికి తగ్గ ఆట ఆడుతున్నారా... ఓ సగటు అభిమాని మనోగతం ఏంటి? ఓసారి చూద్దాం!
టీమ్ఇండియా.. పదినెలల క్రితం కఠినమైన ఆస్ట్రేలియా పిచ్లపై... ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం అనుభవంలేని ఆటగాళ్లతో చారిత్రక సిరీస్ గెలిచింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆ జట్టు తర్వాత కసిగా ఆడి అందరి నోళ్లూ మూయించింది. కట్చేస్తే.. స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ మళ్లీ ఘోరంగా విఫలమైంది. తర్వాత అహ్మదాబాద్లో వరుస విజయాలు సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో స్పిన్కు అనుకూలించే పిచ్లు తయారు చేయించి గెలిచిందంటూ ఇంగ్లాండ్ మాజీల విమర్శలు. కట్చేస్తే.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా ఐదు టెస్టుల సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకొని రెండు విజయాలు సాధించి సిరీస్ కైవసం చేసుకున్నంత పనిచేసింది. దీంతో సీమ్ బౌలింగ్కు అనుకూలించే ఇంగ్లాండ్ గడ్డపైనా రాణించగల సత్తా ఉందని మరోసారి నిరూపించుకుంది. ఇంగ్లాండ్ మాజీల ముఖాలు తెల్లబోయేలా చేసింది.
ఐపీఎల్ అయ్యాక...
అక్కడి నుంచి టీమ్ఇండియా నేరుగా యూఏఈలో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్ జరగబోయే ఎడారి గడ్డపైనే ఐపీఎల్ 14వ సీజన్లోని రెండో దశ జరిగింది. ఇక్కడ భారత ఆటగాళ్లంతా (ఇద్దరు, ముగ్గురు మినహా) ప్రతి ఒక్కరూ సత్తా చాటిన వాళ్లే. కట్చేస్తే ధోనీ సారథ్యంలో చెన్నై విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా ప్రపంచకప్ జట్టుకు అతడిని మెంటార్గా తీసుకొచ్చారు. ఈ నిర్ణయం సగటు భారత అభిమానికి ఎంతో సంతోషం కలిగించింది. ప్రపంచ క్రికెట్లోనే ఆటను అర్థం చేసుకోవడంలో మహీకి మించిన ఆటగాడు లేడు అంటుంటారు క్రికెట్ పండితులు. అతడి ప్రణాళికలకు బిత్తరపోని జట్టు లేదు. అలాంటప్పుడు ఎవరైనా టీమ్ఇండియానే కప్పు సాధిస్తుందని అనుకుంటారు. అలాగే అనుకున్నారు కూడా. ఇక్కడ సీన్ కట్చేస్తే.. పాకిస్థాన్తో తొలి ఓటమి. అయినా తొలి మ్యాచే కదా.. అన్నిసార్లూ మనమే గెలవడం సాధ్యం కాదు కదా.. పాక్ ఆటగాళ్లు బాగా ఆడారు. మనోళ్లు ఒత్తిడికి గురయ్యారు అని అనుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ గత అనుభవాల నేపథ్యంలో తిరిగి బలంగా పుంజుకుంటారని, ఇకపై వరుస విజయాలతో మెగా ఈవెంట్లో దూసుకుపోతారనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
రెండూ... చెత్త ప్రదర్శనలే!
కానీ, అందరి ఆశలు అడియాసలు చేస్తూ.. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మా అసలు ప్రదర్శన ఇదే అనే విధంగా కోహ్లీసేన ఆడింది. డాట్ బాల్స్ 54.. బౌండరీ లేకుండా 74 బంతులు ఆడారంటే మనవాళ్ల పోరాటం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది టీ20 ప్రపంచకప్ అనుకున్నారా..?లేక ఏదో టైమ్ పాస్ మ్యాచ్ ఆడుతున్నామని భావించారా? అసలు ఇలాంటి ప్రదర్శన చూసి కోహ్లీసేన ఏమనుకుంటోందో తెలియదు కానీ.. సగటు అభిమాని మాత్రం దారుణంగా బాధపడ్డాడు. నిరాశ చెందాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లు.. ఆరు ఐసీసీ టోర్నీలు జరగ్గా.. ఒక్కటీ నెగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలైంది. కాదు.. కాదు.. దారుణంగా విఫలమైంది.
అభిమాని మాటలు...
కోహ్లీ సారథ్యం... అందులోనూ ధోనీ మార్గదర్శకత్వం... రవిశాస్త్రి కోచింగ్... ఇలా ఇన్ని రకాల బుర్రలు ఉన్న జట్టు పైనల్కి వెళ్లడం పక్కా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆట చూస్తే.. క్వాలిఫైయర్లు ఆడి సూపర్ 12కి వచ్చిన జట్టు కంటే తక్కువ ప్రదర్శన చేస్తోంది. 11 మంది స్టార్ ప్లేయర్లున్న జట్టు ఇలా ఆడుతుంటే అభిమాని కడుపు రగలదా. సగటు అభిమానికి సహజంగానే కోపం వస్తుంది. అందుకే ఆగ్రహానికి గురయ్యాడు. తనకు తెలిసిన దారిలో... అంటే సామాజిక మాధ్యమాల్లో నిరసన తెలిపాడు. అది ఎంతగా పెరిగింది అంటే... ఎంతో అభిమానించి, రోజుల తరబడి ఆదరించిన ఐపీఎల్ను ఏకంగా బ్యాన్ చెయ్యాలంటూ పోస్టులు పెట్టేంత. ప్రస్తుతం ట్విటర్లో #BANIPL అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉందంటే కోహ్లీ సేన ఏస్థాయి ప్రదర్శన చేసిందో అర్థం చేసుకోవచ్చు. భారత జట్టు చెత్త ప్రదర్శనకు కారణం ఐపీఎల్యేనా, ఇంకేం కారణాలు కనిపించడం లేదా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్ వల్ల శారీరక శ్రమ ఎక్కువై... కీలక టోర్నీలకు అందులోనూ ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి మన సింహాలు చతికిలపడుతున్నాయి. గతంలోనూ ఇది జరిగింది, ఇప్పుడూ జరుగుతోంది. అందుకే అభిమాని ఆగ్రహం ఐపీఎల్ మీద పడింది. టీమ్ఇండియా గెలిచినప్పుడు అభినందించడం, సంతోషించడం ఎంత సహజమో.. వైఫల్యాలు ఎదురైనప్పుడు విమర్శించడం, లోపాలు ఎత్తి చూపడం అంతే సహజం. ఇకనైనా టీమ్ఇండియా మేలుకోవాలి. వచ్చే ఏడాదైనా ఏం చేస్తుందో చూడాలి.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు