T20 World Cup: టీమ్ఇండియాతో ఓటమి మాపై ప్రభావం చూపదు: రషీద్ఖాన్
టీమ్ఇండియాతో ఓటమిపాలవ్వడం అనేది మున్ముందు ఆడే మ్యాచ్ల్లో తమపై ఏమాత్రం ప్రభావం చూపదని అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ఖాన్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాతో ఓటమిపాలవ్వడం అనేది మున్ముందు ఆడే మ్యాచ్ల్లో తమపై ఏమాత్రం ప్రభావం చూపదని అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ఖాన్ అన్నాడు. టీమ్ఇండియా బలమైన జట్టని, అయితే.. తాము ఏ మ్యాచ్ అయినా ఒకేలా సన్నద్ధమవుతామని చెప్పాడు. ప్రతి గేమ్లోనూ తాము ఒకే ఆలోచనా విధానంతో బరిలోకి దిగుతామని తెలిపాడు. తాజాగా కోహ్లీసేనతో తలపడిన మ్యాచ్లో అఫ్గాన్ 66 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రషీద్ తన బౌలింగ్తో ఆకట్టుకోలేకపోయాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చాడు.
ఇక న్యూజిలాండ్తో ఆడే కీలకపోరు తమకు క్వార్టర్ ఫైనల్ లాంటిదని, ఒకవేళ తాము గెలిస్తే అన్ని జట్ల కన్నా మెరుగైన రన్రేట్తో తామే సెమీస్కు అర్హత సాధిస్తామని రషీద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆటను ఆస్వాదించాలని, తమ నైపుణ్యాలపై దృష్టిసారించి విజయం సాధించాలని ఉందన్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ను ఆస్వాదించినంత కాలం గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నాడు. కాగా, ఆదివారం జరిగే ఈ మ్యాచ్లో నిజంగానే అఫ్గాన్ గెలిస్తే టీమ్ఇండియా సైతం సెమీస్కు చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, మిగిలిన రెండు మ్యాచ్ల్లో కోహ్లీసేన నమీబియా, స్కాట్లాండ్ జట్లపై గెలవాల్సి ఉంటుంది. అప్పుడు నెట్రన్రేట్ పరంగా ఎవరు మెరుగ్గా ఉంటే.. వారే సెమీస్కు వెళ్లే వీలుంటుంది. దీంతో అఫ్గాన్, న్యూజిలాండ్ మ్యాచ్ కీలకం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
-
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!