David Warner: పడిలేచిన కెరటం.. ప్రపంచకప్ అందించాడు..!
సముద్రం కాస్త వెనక్కి వెళ్లిందంటే మరింత ముందుకు దూసుకొస్తుందని అర్థం. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం అలాంటి వాడే అనడంలో ఎలాంటి సందేహం లేదు...
సముద్రం కాస్త వెనక్కి వెళ్లిందంటే మరింత ముందుకు దూసుకొస్తుందని అర్థం. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం అలాంటి వాడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు పడి లేచిన కెరటం. ఏడేళ్లు వరుసగా ఐపీఎల్లో పరుగుల వరద పారించిన అతడు ఒక్క సీజన్లో విఫలమయ్యేసరికి.. తన పనైపోయిందనే విమర్శలు ఎదుర్కొన్నాడు. మరీ ముఖ్యంగా సన్రైజర్స్ హైదరబాద్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన తనని.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడం మరింత అవమానకరంగా మారింది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్లో అడుగుపెట్టి నెల రోజులు తిరగకముందే తానేంటో నిరూపించుకున్నాడు. ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచి విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. దీంతో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
పరుగులే పరుగులు..
ఐపీఎల్లో వార్నర్ తిరుగులేని బ్యాట్స్మన్ అని అందరికీ తెలిసిందే. 2014లో సన్రైజర్స్ జట్టులో చేరిన అతడు అప్పటి నుంచీ గతేడాది వరకు వరుసగా ఏడేళ్లు 500పై చిలుకు పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ అందుకొని తనకు మరెవరూ సాటిలేరని చాటిచెప్పాడు. 2014 సీజన్లో తొలిసారి 528 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్.. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. 2015 సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా నియమితుడై 562 పరుగులు సాధించి ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇక 2016 సీజన్లో 848 పరుగులతో మరింత రెచ్చిపోయి ఏకంగా ఐపీఎల్ టైటిల్నే అందించాడు. అప్పుడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 973 తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆపై వరుసగా 641, 692, 548 పరుగులు చేసి ఏటా ఆ జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు.
ఒక్కసారి విఫలమయ్యేసరికి..
అంత నిలకడగా బ్యాటింగ్లో రాణిస్తూ సారథిగా జట్టును ముందుండి నడిపించిన వార్నర్.. ఈ సీజన్లోనే తేలిపోయాడు. అటు కెప్టెన్గా, ఇటు బ్యాట్స్మన్గా విఫలమయ్యాడు. భారత్లో జరిగిన తొలి అర్ధ భాగంలో ఫర్వాలేదనిపించిన అతడు యూఏఈలో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో రెండు అర్ధశతకాలతో 195 పరుగులు చేశాడు. మరోవైపు ఈసారి జట్టు కూడా మొత్తంగా చేతులెత్తేసింది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించి అత్యంత దారుణమైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ యాజమాన్యం వార్నర్ను పక్కనపెట్టింది. లీగ్ చివరి దశలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి సైతం తొలగించింది. కేన్ విలియమ్సన్కు ఆ పగ్గాలు అప్పగించింది. తుది జట్టులో అవకాశమే ఇవ్వకుండా అవమానకర పరిస్థితులు కలుగజేసింది. అయినా వార్నర్ అవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. తనని తుది జట్టులో నుంచి తొలగించినా డగౌట్లో కూర్చొని జట్టు విజయాల కోసం మద్దతిచ్చాడు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సన్రైజర్స్ తరఫున ఇదే తన చివరి సీజన్ అనే సంకేతాలు సైతం ఇచ్చాడు.
తన విలువేంటో చాటిచెప్పాడు..
ఇక ఐపీఎల్ ముగిసి సరిగ్గా నెల రోజులు తిరగకముందే ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్లో ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 289 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 303 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో వార్నర్ మూడు అర్ధ శతకాలు సాధించగా.. మరోవైపు సెమీస్లో పాకిస్థాన్పై 49, ఫైనల్లో న్యూజిలాండ్పై 53 పరుగులు సాధించి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆ జట్టు తొలిసారి టీ20 క్రికెట్లో ఛాంపియన్గా అవతరించింది. ఈ ప్రదర్శనతో వార్నర్ తన పనైపోయిందని విమర్శించిన వారికి చెంపపెట్టులా సమాధానమిచ్చాడు. వార్నర్ సతీమణి క్యాండీస్ సైతం ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది. తన భర్తని అభినందిస్తూనే.. ఫామ్ కోల్పోయాడని, వయసు పైబడిందని, ఆటలో వేగం తగ్గిందని విమర్శించిన వారందరినీ ఎద్దేవా చేసింది. ఏదేమైనా వార్నర్ నిజంగానే కీలక సమయంలో రాణించి తన జట్టును గెలిపించడమే కాకుండా తన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్లో అతడిని ఏ జట్టు తీసుకుంటుందో వేచి చూడాలి.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు