T20 World Cup: వార్నర్ని ఎంపిక చేయడం కచ్చితంగా తప్పుడు నిర్ణయమే: అక్తర్
టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపిక చేయడం తప్పుడు నిర్ణయమని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపిక చేయడం తప్పుడు నిర్ణయమని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇది సరైన నిర్ణయం కాదన్నాడు. ఆదివారం రాత్రి న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో వార్నర్ (53) అర్ధ శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ టోర్నీలో మొత్తం 289 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 303 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. అయినా, అతడిని కాదని వార్నర్ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక చేయడం అక్తర్కు నచ్చలేదు.
‘బాబర్ అజామ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపిక అవుతాడని నేను నిజంగా ఎదురుచూశాను. ఇది కచ్చితంగా సరైన నిర్ణయం కాదు’ అని తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు వార్నర్ ఫామ్ కోల్పోయి సతమతమయ్యాడు. ఐపీఎల్లోనూ పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు. అయినా, ఏడు మ్యాచ్ల్లో మూడు అర్ధశతకాలతో రాణించాడు. ఒకవైపు కెప్టెన్ ఆరోన్ ఫించ్ విఫలమవుతున్న వేళ మరోవైపు టాప్ ఆర్డర్లో కీలక సమయాల్లో అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా పాక్తో సెమీస్లో 49, కివీస్తో ఫైనల్లో 53 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపిక చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు