Tokyo olympics : క్వార్టర్స్‌లో నిరాశపరిచిన భారత బాక్సర్‌ సతీశ్‌కుమార్‌

టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌లో భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ నిరాశపరిచాడు. బాక్సింగ్‌ 91

Updated : 01 Aug 2021 10:20 IST

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌లో భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ నిరాశపరిచాడు. బాక్సింగ్‌ 91+ కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ జలొలోవ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. సతీశ్‌పై 5-0 తేడాతో జలొలోవ్‌ గెలుపొందాడు.

బాక్సింగ్‌లో నిన్న భారత్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. కచ్చితంగా పతకం తెస్తాడన్న అంచనాలు ఉన్న టాప్‌ సీడ్‌ అమిత్‌పంగాల్‌(52 కిలోలు) ప్రిక్వార్టర్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని