Shoaib Akhtar: షారుఖ్‌, సల్మాన్‌ సొంత తమ్ముడిలా చూసుకున్నారు: అక్తర్‌

భారతదేశంలో తనకెన్నో మధుర స్మృతులు ఉన్నాయని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అంటున్నాడు. త్వరలోనే రెండు దేశాల సంబంధాలు మెరుగవుతాయని ఆశించాడు...

Published : 20 Aug 2021 18:22 IST

ముంబయి: భారతదేశంలో తనకెన్నో మధుర స్మృతులు ఉన్నాయని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అంటున్నాడు. త్వరలోనే రెండు దేశాల సంబంధాలు మెరుగవుతాయని ఆశించాడు. బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ తనని సొంత తమ్ముడిలా చూసుకొనేవారని గుర్తు చేసుకున్నాడు.

‘ముంబయి వాసులతో కలవడం నాకెంతో ఇష్టం. సల్మాన్‌, షారుఖ్‌ నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలిసినప్పుడు భద్రంగా చూసేవాళ్లు. దురదృష్టవశాత్తూ ఐదేళ్లుగా భారత్‌కు రాలేదు. కానీ ఒకప్పుడు నన్నక్కడ ఆధార్‌ కార్డు, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అడిగేవారు! ఎందుకంటే నేనంతగా అక్కడ పనిచేశాను’ అని అక్తర్‌ అన్నాడు.

‘భారత్‌లో నాకెన్నో మధురస్మృతులు ఉన్నాయి. నేను మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాలని ప్రార్థిస్తున్నాను. మరికొన్ని నెలల్లో భారత్, పాక్‌ సంబంధాలు మెరుగవ్వాలని కొన్ని రోజుల ముందే నా మిత్రులతో అన్నాను. అలా జరగ్గానే భారత్‌లో వాలిపోయే మొదటి పాకిస్థానీని నేనే అవుతా. అంతేకాదు టన్నుల కొద్దీ డబ్బు సంపాదించుకుంటా (నవ్వుతూ)’ అని షోయబ్‌ అన్నాడు. ఈ రావల్పిండీ ఎక్స్‌ప్రెస్‌కు భారత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది! హిందీ చిత్ర పరిశ్రమలో అతడికి సన్నిహితులు ఉన్నారు. అంతేకాకుండా కొన్ని టీవీ రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు