IND vs ENG: అవకాశం దొరికినప్పుడు కనికరం లేకుండా విరుచుకుపడ్డాం: రూట్
టీమ్ఇండియాపై వికెట్లు తీసే అవకాశం దొరికినప్పుడు కనికరం లేకుండా విరుచుకుపడ్డామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. మూడో టెస్టులో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించాక అతడు మాట్లాడుతూ తమ పేసర్లను కొనియాడాడు...
లీడ్స్: టీమ్ఇండియాపై వికెట్లు తీసే అవకాశం దొరికినప్పుడు కనికరం లేకుండా విరుచుకుపడ్డామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. మూడో టెస్టులో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించాక అతడు మాట్లాడుతూ తమ పేసర్లను కొనియాడాడు. వారు అద్భుతమైన ప్రదర్శన చేశారని, ఇలాంటి మంచి ప్రదర్శన చేస్తామని తమకు ముందే తెలుసని రూట్ పేర్కొన్నాడు. అంతటి నైపుణ్యం ఇంగ్లాండ్ జట్టుకు ఉందని, ఈ క్రమంలోనే నాలుగో రోజు కొత్త బంతితో చెలరేగామని వివరించాడు. బంతితో అండర్సన్ మాయచేశాడని కొనియాడాడు. ఇప్పటికీ అతడు ఇతర బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని, అందుకే అతడిని టెస్టు క్రికెట్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ అని అభివర్ణిస్తారని అన్నాడు.
ఇక ఈ మ్యాచ్లో రాణించిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హమీద్తో పాటు డేవిడ్ మలన్ కూడా బాగా ఆడారన్నాడు. మరోవైపు తన హోమ్ గ్రౌండ్లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం గొప్పగా ఉందన్నాడు. ఇక ముందు కూడా ఇలాంటి ప్రదర్శనతోనే ముందుకు సాగుతామన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్లో ఏడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన రాబిన్సన్ను గురించి మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు. అతడు బంతిని రెండు వైపులా తిప్పుతూ భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడన్నాడు. అనంతరం సామ్కరన్పై స్పందించిన రూట్.. అతడు ఈ మ్యాచ్లో రాణించకపోయినా కీలక ఆటగాడని గుర్తుచేశాడు. గతంలో టీమ్ఇండియాపై మంచి ప్రదర్శన చేసినట్లు ఇంగ్లాండ్ సారథి చెప్పుకొచ్చాడు. చివరగా బట్లర్ పితృత్వపు సెలవులపై స్పందిస్తూ.. దాని గురించి తర్వాత తెలుస్తుందని చెప్పాడు. ఇక మిగిలిన రెండు టెస్టుల్లోనూ తాము ఇలాగే ఆడతామనే ధీమా వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్