IPL 2021: ఈ నాలుగింట్లో.. ప్లేఆఫ్స్ చేరేదెవరు?
ఐపీఎల్ 14వ సీజన్లో లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్పై పడింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్పై పడింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ స్థానాలను ఖరారు చేసుకోగా పది ఓటములతో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. అందులో కోల్కతా నైట్రైడర్స్ ఆధిక్యంలో ఉండగా తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ ఉన్నాయి. అయితే, ఇందులో ప్రధానంగా కోల్కతాకే ఎక్కువ అవకాశాలున్నాయి.
అడుగు దూరంలో కోల్కతా..
(Photo: KKR Twitter)
కోల్కతా ఇప్పటికే ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రన్రేట్ (+0.294) పరంగా చూసినా మిగతా మూడు జట్ల కన్నా మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. మరోవైపు గురువారం రాజస్థాన్తో చివరి మ్యాచ్లో ఆడాల్సి ఉండగా అందులో గెలిస్తే నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గనుక కోల్కతా ఓడితే తర్వాతి స్థానాల్లో ఉన్న రాజస్థాన్ లేదా ముంబయి నాలుగో స్థానం కోసం పోటీపడే వీలుంది.
కోల్కతా ఓటమే.. ముంబయికి అవకాశం
డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో కీలక మ్యాచ్ల్లో ఓటమిపాలై ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో ఐదు విజయాలే సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్ జట్లతో సమానంగా 10 పాయింట్లతో కొనసాగుతున్నా.. రన్రేట్ (-0.453) పరంగా వెనుకంజలోనే కొట్టుమిట్టాడుతోంది. అయితే, రోహిత్ సేన ఇంకా హైదరాబాద్, రాజస్థాన్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు.. రాజస్థాన్ చేతిలో కోల్కతా ఓడితే తప్పా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు.
రాజస్థాన్ రెండు గెలిస్తే తప్ప..
రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి ఆరో స్ధానంలో నిలిచింది. రన్రేట్ (-0.337) పరంగా ముంబయికి ఎక్కువ (-0.453), పంజాబ్కి (-0.241) తక్కువగా ఉంది. ఇక ఈ జట్టు మిగిలిన రెండు మ్యాచ్ల్లో ముంబయి, కోల్కతాను ఓడిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇందులో ఏ ఒక్క మ్యాచ్ కోల్పోయినా ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యం. ఒకవేళ లీగ్ దశ అయిపోయేసరికి మిగతా మూడు జట్లతో సమానంగా 12 పాయింట్లతో నిలిస్తే అప్పుడు మెరుగైన రన్రేట్ ఉంటే అవకాశం ఉంది.
పంజాబ్ అదృష్టం కష్టమే..
(Photo: PBKS Twitter)
ఇక పంజాబ్ ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతాలే జరగాలి. అవి దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాహుల్ టీమ్ ఆడిన 13 మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి (-0.241) రన్రేట్తో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. చెన్నైతో ఆడాల్సిన చివరి మ్యాచ్లో 70 పరుగుల తేడాతో గెలవాలి. అది కూడా రాజస్థాన్ చేతిలో కోల్కతా సైతం 70 పరుగుల తేడాతో ఓటమిపాలైతేనే. అందుకే పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. రెండు మ్యాచ్ల్లో అద్భుతాలు జరిగితే తప్ప పంజాబ్ ప్లేఆఫ్స్ చేరదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ