IPL 2021: సంజూ శాంసన్ కొట్టుడు.. రాజస్థాన్ రాయల్స్ ఓడుడు!
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ ఐపీఎల్ సీజన్లో ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడు బ్యాట్ ఝుళిపించిన ప్రతిసారి ఆ జట్టు ఓటముల పాలవుతోంది...
ధావన్ నుంచి ఆరెంజ్ క్యాప్ అందుకున్న రాజస్థాన్ కెప్టెన్
ఇంటర్నెట్డెస్క్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ ఐపీఎల్ సీజన్లో ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడు బ్యాట్ ఝుళిపించిన ప్రతిసారి ఆ జట్టు ఓటముల పాలవుతోంది. ఇప్పటివరకు ఈ సీజన్లో అతడు మూడు మ్యాచ్ల్లో దంచి కొట్టగా అన్నింట్లోనూ రాజస్థాన్ విఫలమైంది. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ అదే పరిస్థితి ఎదురైంది.
సంజూ తొలుత ఏప్రిల్లో టోర్నీ ప్రారంభమైనప్పుడు పంజాబ్పై చెలరేగాడు. అప్పుడా మ్యాచ్లో (119) సెంచరీతో చెలరేగగా పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 217 పరుగులు చేసింది. దీంతో త్రుటిలో రాజస్థాన్ తొలి విజయాన్ని కోల్పోయింది. అనంతరం రెండో దశలో దిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ 155 పరుగుల ఛేదనలో సంజూ (70 నాటౌట్; 53 బంతుల్లో 8x4, 1x6) విజృంభించాడు. కానీ, రాజస్థాన్ 121/6 స్కోరుకే పరిమితమై ఓటమి చవిచూసింది. ఇక సోమవారం హైదరాబాద్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 164/5 స్కోర్ సాధించింది. కెప్టెన్ (82; 57 బంతుల్లో 7x4, 3x6) మరోసారి చెలరేగాడు. అయినా ఫలితం సున్నా. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్ల్లో అయినా రాజస్థాన్ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
టాప్లోకి దూసుకొచ్చాడు..
మరోవైపు సంజూ శాంసన్ ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 19వ బ్యాట్స్మన్గా నిలిచాడు. గతరాత్రి హైదరాబాద్పై ధాటిగా ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో మూడు వేల పరుగులు పూర్తి చేయడమే కాకుండా ఈ సీజన్లో అత్యధిక పరుగులతో దూసుకుపోతున్నాడు. దిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ (430)ను అధిగమించి సంజూ (433) ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇప్పటివరకు సంజూ ఐపీఎల్లో మొత్తం 3,017 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ 6,185 పరుగులతో అందరి కన్నా ముందున్నాడు. ఆ తర్వాత ధావన్ (5,627), రోహిత్ శర్మ (5,556), సురేశ్ రైనా (5,523), డేవిడ్ వార్నర్ (5,449) పరుగులతో వరుసగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?