IPL 2021: కమాన్ హర్షల్.. ఐపీఎల్లో నువ్వు కొత్త చరిత్ర సృష్టిస్తావు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో...
(Photo: Harshal Patel Instagram)
ఇంటర్నెట్డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న అతడు ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో మరో మూడు వికెట్లు పడగొడితే.. ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వేయిన్ బ్రావో 2013లో 32 వికెట్లు తీసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే హర్షల్ మరో మూడు వికెట్లు సాధిస్తే ఆ రికార్డునూ బద్దలుకొడతాడు.
మరోవైపు ఈ బెంగళూరు పేసర్ ఇప్పటికే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్గానూ కొనసాగుతున్నాడు. 2020లో ముంబయి ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా 27 వికెట్లతో చెలరేగి ఇదివరకు ఆ రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు బెంగళూరు పేసర్ దాన్ని తిరగరాశడు. లీగ్ దశలో కోహ్లీసేన తమ చివరి మ్యాచ్లో దిల్లీపై గెలవకముందు సన్రైజర్స్తో ఓ మ్యాచ్ ఆడి ఓటమిపాలైంది. అందులో హర్షల్ మూడు వికెట్లు తీసి బుమ్రా రికార్డును అధిగమించాడు. అలాగే జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ ఈ బెంగళూరు పేసర్ మరో రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు.. ఈరోజు కోల్కతాతో తలపడే మ్యాచ్లో విజయం సాధించి.. ఆపై క్వాలిఫయర్-2లోనూ దిల్లీపై గెలుపొంది ఆ జట్టు ఫైనల్ చేరితే హర్షల్ మరిన్ని ఎక్కువ వికెట్లు తీసే అవకాశం ఉంది. ఇక దిల్లీ బౌలర్ అవేశ్ ఖాన్ ఈ సీజన్లో 23 వికెట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.