IPL 2021: ఇది ఛేదిస్తామనుకున్నా: సంజూ.. ప్రణాళిక ప్రకారమే ఆడతాం: పంత్
దిల్లీతో తలపడిన మ్యాచ్లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చని అనుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దిల్లీ తొలుత బ్యాటింగ్...
ఇంటర్నెట్డెస్క్: దిల్లీతో తలపడిన మ్యాచ్లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చని అనుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి 154/6 స్కోర్ సాధించగా.. రాజస్థాన్ ఛేదనలో తడబడింది. ఈ జట్టు 121/6కే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో దిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకొని ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. మరోవైపు ఈ ఓటమితో రాజస్థాన్ ఏడో స్థానానికి పడిపోయింది.
155 ఛేదిస్తామనుకున్నా: సంజూ
‘మాకున్న బ్యాటింగ్ లైనప్ చూసి 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తామనుకున్నా. అయితే 121 పరుగులకే పరిమితమవ్వడం నిరాశ కలిగించింది. తర్వాతి మ్యాచ్లో మరింత బలంగా పుంజుకొంటాం. ప్రస్తుతం మేమంతా చాలా భావోద్వగంతో ఉన్నాం. ఈ ఓటమి గురించి ఆదివారం చర్చించుకుంటాం. అయితే, ఈ పిచ్ మరీ అంత నెమ్మదిగా లేకపోయినా పెద్ద స్కోర్ సాధించేలా అనిపించలేదు. అయితే, మాకు కొన్ని వికెట్లు మిగిలి ఉంటే ఈ మ్యాచ్ను గెలిచేవాళ్లం’ అని సంజూ వివరించాడు.
ప్రణాళిక పరంగా ఆడతాం: పంత్
‘మా బౌలర్ల నుంచి ఇదో అత్యుత్తమ ప్రదర్శన. ఆడే మ్యాచ్పైనే దృష్టిసారించి ప్రణాళికలు రచిస్తాం. బ్యాట్స్మెన్ను బట్టి వాటిని మైదానంలో అమలు చేస్తాం. మా జట్టులో అశ్విన్ బౌలింగ్ చేసేటప్పుడు ఫీల్డింగ్ తానే సెట్ చేస్తాడు. అతడొక సీనియర్ ఆటగాడైనందున చొరవ తీసుకోవాలని చూస్తాడు. ఒక కెప్టెన్గా నేనది గౌరవిస్తా. అలాగే నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా ఇలా వరుస విజయాలు సాధిస్తుంటే ఆనందంగా ఉంది. ఇక నేనూ, శ్రేయస్ అయ్యర్ చాలా కాలంగా ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నందున మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం నెలకొంది’ అని పంత్ చెప్పుకొచ్చాడు.
వాళ్లిద్దరూ ఈసారి ఆడలేకపోయారు: శ్రేయస్
‘ఈ మ్యాచ్లో ఏం జరిగినా నేను క్రీజులో పాతుకుపోవాలని నిర్ణయించుకున్నా. బంతిని గమనిస్తూ ఫీల్డర్ల మధ్య నుంచి ఆడాలనుకున్నా. తర్వాత స్పిన్నర్లను టార్గెట్ చేద్దామనుకున్నా. అయితే, మా జట్టులో ధావన్, పృథ్వీ.. ఇద్దరూ దూకుడైన బ్యాట్స్మెన్. ఈసారి వాళ్లు ఆడలేకపోయారు. వాళ్లు బాగా ఆడితే జట్టుకు శుభారంభాలే అందిస్తారు. ఈ క్రమంలోనే వాళ్లు ఔటయ్యాక భాగస్వామ్యాలు జోడించాలనుకున్నా. పంత్ రాగానే ఇద్దరం అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పాం. అతడు వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడితే మరో ఎండ్లో ఉండే నాకు ఉపశమనం లభిస్తుంది. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం సంతోషంగా ఉంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్పేహితులు అండగా నిలిచారు. ఇప్పుడు మైదానంలో రాణించడం బాగుంది’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.