IPL 2021: కోల్కతాతో ఓటమిపాలయ్యాక.. పంత్, పృథ్వీ కంటతడి!
కోల్కతా నైట్ రైడర్స్తో క్వాలిఫయర్-2లో ఓటమిపాలైన సందర్భంగా దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీషా కంటతడి పెట్టారు...
(Photo: Prithvi Shaw Instagram)
ఇంటర్నెట్డెస్క్: కోల్కతా నైట్ రైడర్స్తో క్వాలిఫయర్-2లో ఓటమిపాలైన సందర్భంగా దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీషా కంటతడి పెట్టారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత ఓవర్లలో 135/5 స్వల్ప స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో కోల్కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (55), శుభ్మన్ గిల్ (46) ధాటిగా ఆడి తొలి వికెట్కు 96 పరుగులు జోడించారు. దీంతో ఆ జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే కోల్కతా సునాయాస విజయం సాధిస్తుందని ఆశించినా చివరి నాలుగు ఓవర్లలో దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్పై పట్టు సాధించింది. ఏకంగా మ్యాచ్ గెలించేంత పని ప్రత్యర్థికి చెమటలు పట్టించింది.
కోల్కతా విజయానికి 24 బంతుల్లో 13 పరుగులు అవసరమైన వేళ దిల్లీ పేసర్లు అవేశ్ ఖాన్, నార్జే, రబాడ కట్టుదిట్టంగా బంతులేశారు. 17, 18, 19 ఓవర్లలో బౌలింగ్ చేసి ఆరు పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశారు. దీంతో ఒక్కసారిగా దిల్లీ పోటీలోకి వచ్చి ఆ శిబిరంలో ఆశలు నింపింది. ఆఖరి ఓవర్లో కోల్కతా విజయానికి 7 పరుగులు అవసరమైన వేళ అశ్విన్ బౌలింగ్ చేసి తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి షకిబ్ (0), నరైన్ (0)ను ఔట్ చేశాడు. ఇక కోల్కతా విజయానికి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన వేళ దిల్లీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లోనే రాహుల్ త్రిపాఠి (12) సిక్సర్ బాది తమ జట్టును గెలిపించాడు. దీంతో ఈసారైన కప్పు గెలవాలని అనుకున్న దిల్లీ క్యాపిటల్స్ కల చెదిరింది.
ఈ నేపథ్యంలోనే పృథ్వీ, పంత్ ఓటమిపాలయ్యాక కంటతడి పెట్టారు. పృథ్వీ మైదానంలోనే కిందపడి భావోద్వేగం చెందాడు. తోటి ఆటగాళ్లు అతడిని పైకి లేపి డ్రెస్సింగ్ రూమ్క తీసుకెళ్లారు. మరోవైపు కెప్టెన్ పంత్ కూడా బాధతో కనిపించాడు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మరోవైపు కోల్కతా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఓటమిటంచుల దాకా వెళ్లి చివరికి సంచలన విజయం సాధించడంపై నెటిజెన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. రాహుల్ను మెచ్చుకుంటూనే చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టు బ్యాటింగ్ తీరును ఇలా 0, 1 ,1, W, 0, 0, 0, 0, 0, 0, 1, W, 2, 0, 1, 0, 0, W, 1, 0, W, W, SIX! ఉందంటూ సరదాగా స్పందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
గుజరాత్తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ 4 పరుగుల తేడాతో నెగ్గింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM