Tokyo Olympics: ‘మాగ్నిఫిసెంట్ మేరీ’ నిష్క్రమణ.. ఓటమి భారంతో విలవిలా ఏడ్చేసిన విజేత!
భారత అగ్రశ్రేణి బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. 48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో ఆమె పోరాడి ఓడింది. కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా...
ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్.. ఐదు సార్లు ఆసియా విజేత.. ఒలింపిక్స్లో కాంస్యం.. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. భారతమాత ముద్దుబిడ్డ.. ప్రపంచం మెచ్చిన ‘మాగ్నిఫిసెంట్ మేరీ’..
ఆమె వీడ్కోలుపై ఎన్నెన్నో ఊహాగానాలు..51 కిలోల విభాగంలో ఆమెవల్ల యువతకు అవకాశాలు రావడం లేదని విమర్శలు.. 38 ఏళ్లు.. ఈ వయసులో బాక్సింగ్ ఏమంత సులువు కాదు..
బాక్సింగ్ ప్రపంచంలో ఎన్నో అపూర్వ విజయాలు అందుకున్న మేరీ సాధించాల్సింది మరేం లేదు! అయినా ఆమె ఓ కలగన్నది. టోక్యోలో స్వర్ణపతకం గెలిచి భరతమాత మెడలో అలంకరించాలని ఆశించింది..
విధి ఆమెకు అడ్డు తగిలింది.. తనలాగే.. తన దేశానికి మరో పతకం తీసుకురావాలని.. ఆ దేశం తరఫున తొలి పతకం గెలిచిన మరో సీనియర్ బాక్సర్ చేతిలో మేరీ ఓటమి పాలైంది. ఆ భారంతో బాక్సింగ్ రింగ్లోనే విలపించింది. కన్నీరు కార్చింది. ఇక ఆమె వీడ్కోలు పలికినట్టే!
మహిళల బాక్సింగ్లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్కు ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్లోనే ఆమె నిష్క్రమించింది. 51 కిలోల విభాగంలో రియో కాంస్యపతక విజేత, కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్ లొరనా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన పోరు చివర్లో రిఫరీ తన ప్రత్యర్థి చేయి పైకెత్తగానే మేరీ ఒకపక్క నవ్వుతూనే.. తన బాధను భరించలేక ఏడ్చేసింది.
వీరిద్దరి మధ్య పోరు ఆరంభమవ్వగానే బాక్సింగ్ రింగులో ఓల్టేజీ తారస్థాయికి చేరుకుంది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. పాయింట్ల కోసం శ్రమించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించసాగారు. తొలిరౌండ్లో త్రుటిలో వలెన్షియాకు ఆధిక్యం దక్కింది. ఐదుగురు జడ్జీలు ఆమెకు 49 పాయింట్లు ఇవ్వగా మేరీకోమ్కు 46 మాత్రమే కేటాయించారు. దాంతో 4-1తో వలెన్షియా ముందంజ వేసింది.
ఆ తర్వాతి రెండు రౌండ్లలో భారత బాక్సర్ విజృంభించింది. తన అనుభవాన్ని ఉపయోగించి పంచ్లు విసిరింది. ప్రత్యర్థి సైతం అదే రీతిలో చెలరేగినా 3-2 తేడాతో రెండు రౌండ్లనూ గెలిచింది. అయితే తొలిరౌండ్లో వలెన్షియాకు స్వల్ప ఆధిక్యం ఉండటంతో మేరీకోమ్ ఓటమి పాలైంది. మొత్తంగా ఈ పోరులో 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో పరాజయం చవిచూసింది. బహుశా ఇక ఆమె కెరీర్ ముగిసినట్టే!
2019 ప్రపంచ ఛాంపియన్షిప్ క్వార్టర్స్లో వలెన్షియాను ఓడించిన మేరీకోమ్ ఒలింపిక్స్ ప్రిక్వార్టర్లో ఆమె చేతిలోనే ఓటమి చెందాల్సి వచ్చింది. కొలంబియా తరఫున ఒలింపిక్స్లో తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్ వలెన్షియానే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్