IND vs NZ : ఆధిక్యం టీమ్ఇండియాదే.. కానీ చివర్లో కాస్త తడబాటు
కివీస్ను కట్టడి చేసి స్వల్ప ఆధిక్యం సాధించామన్న ఆనందం టీమ్ఇండియాకు కాసేపు కూడా లేదు. 49 పరుగుల...
ముగిసిన మూడో రోజు ఆట
రెండో ఇన్నింగ్స్లోనూ తొలి దెబ్బ కొట్టిన జేమీసన్
ఇంటర్నెట్ డెస్క్: కివీస్ను కట్టడి చేసి స్వల్ప ఆధిక్యం సాధించామన్న ఆనందం టీమ్ఇండియాకు కాసేపు కూడా లేదు. 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (1)ను కివీస్ బౌలర్ జేమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. జేమీసన్కిది 50వ టెస్టు వికెట్ కావడం విశేషం. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం టీమ్ఇండియా 63 పరుగుల లీడ్లో కొనసాగుతోంది. క్రీజ్లో మయాంక్ అగర్వాల్ (4*), పుజారా (9*) ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. భారత్ మొదటి ఇన్నింగ్స్లో 345 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఒక్క రోజే 11 వికెట్లు పడటం గమనార్హం. మూడో రోజు మొత్తం ఆధిక్యం ప్రదర్శించిన భారత్.. ఆఖర్లో గిల్ వికెట్ చేజార్చుకోవడంతో కాస్త తడబాటుకు గురైంది. అయితే అగర్వాల్, పుజారా మరో వికెట్ పడనీయకుండా రోజును ముగించారు.
చెలరేగిన భారత్ బౌలర్లు
129/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ను 296 పరుగులకే ఆలౌట్ చేయడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా అక్షర్ పటేల్ (5/62) కివీస్ను దెబ్బతీశాడు. అక్షర్కు తోడు అశ్విన్ (3/82) కీలకమైన సమయాల్లో వికెట్లు తీశారు. కివీస్ ఓపెనర్లు లేథమ్ (95), విల్ యంగ్ (89) సెంచరీ సాధించకుండా అడ్డుకున్నారు. ఆఖర్లో జేమీసన్ (23) భారత బౌలర్లను పరీక్షించగా... మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. విలియమ్సన్ 18, రాస్ టేలర్ 11, నికోల్స్ 2, టామ్ బ్లండెల్ 13, రచిన్ రవీంద్ర 13, సౌథీ 5, సోమర్విల్లే 6, అజాజ్ పటేల్ 5* పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.