Rohit - Rahul: రోహిత్-రాహుల్కు బ్యాకప్ ఆటగాడిని చూడాలి: డీకే
టీమ్ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా అదరగొడుతున్నారని.. అయితే, వారికి ఒక బ్యాకప్ ఆటగాడిని చూడాలని సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా అదరగొడుతున్నారని.. అయితే, వారికి ఒక బ్యాకప్ ఆటగాడిని చూడాలని సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరికైనా గాయాలైతే బ్యాకప్ ఆటగాడు ఉండాలని అభిప్రాయపడ్డాడు.
‘నాకో సందేహం ఉంది. వాళ్లిద్దరిలో ఎవరికైనా గాయమైతే ప్రత్యామ్నాయంగా ఉండే మూడో ఓపెనర్ ఎవరు? జట్టు యాజమాన్యం అలాంటి ఆటగాడిని కనుగొనాల్సి ఉంది. జట్టులో ముగ్గురు ఓపెనర్లకు మించిన అవసరం రాదనుకుంటా. అదొక్కటే నా అనుమానం. ఈ విషయంపై జట్టు యాజమాన్యం దృష్టిసారించాలి. మూడో ఓపెనర్గా సరైన బ్యాట్స్మన్ను కనుగొనాలి’ అని కార్తీక్ అన్నాడు.
అలాగే టీమ్ఇండియాలో ఇప్పుడు చాలా మంది బ్యాటర్లు ఉన్నారని, అందులో బాగా ఆడే కొందరి పేర్లు కూడా డీకే సూచించాడు. లెఫ్ట్హ్యాండ్ బ్యాట్స్మెన్లలో ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్, వెంకటేశ్ అయ్యర్ ఉన్నారని.. రైట్హ్యాండ్ బ్యాట్స్మన్లలో రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడని గుర్తుచేశాడు. ఓపెనర్లుగా రోహిత్-రాహుల్ ఇప్పటికే నిరూపించుకున్నారని, ఇక కివీస్తో ఆదివారం తలపడే మూడో టీ20లో ఒకరు తప్పుకొని మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని కోరాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కల్లా సరైన మూడో ఓపెనర్ను తయారు చేయాలని, అతడు వీరిద్దరితో సమానంగా పరుగులు చేసేలా ఉండాలని డీకే చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM