Praveen Kumar: గూగుల్లో శోధించి.. పారాలింపిక్స్లో రజతం ముద్దాడి..!
బాల్యం నుంచీ ఆటలే ప్రాణంగా పెరిగాడు. వైకల్యం ఉందని తెలిసినా ముందుకే సాగాడు. ఆటల్లో రాణించగలడా తన బడిలో అనుమానించినా పట్టుదల ప్రదర్శించాడు....
ఇంటర్నెట్ డెస్క్: బాల్యం నుంచీ ఆటలే ప్రాణంగా పెరిగాడు. వైకల్యం ఉందని తెలిసినా ముందుకే సాగాడు. ఆటల్లో రాణించగలడా తన బడిలో అనుమానించినా పట్టుదల ప్రదర్శించాడు. గూగుల్లో పారాలింపిక్స్ గురించి తెలుసుకొని నేడు రజత పతకం పొందాడు. అతడే పారా హైజంపర్ ప్రవీణ్ కుమార్. 18 ఏళ్లకే పతకం ముద్దాడి సరికొత్త ఘనత అందుకున్నాడు.
దిల్లీలోని గౌతమబుద్ధనగర్ జిల్లాలోని జెవర్ సమీప గ్రామంలో ప్రవీణ్ కుమార్ జన్మించాడు. అతడి తండ్రి రైతు. వారిది పేద కుటుంబం. చిన్నప్పటి నుంచీ ప్రవీణ్కు ఆటలంటే ప్రాణం. వైకల్యం ఉన్నప్పటికీ అందులోనే ఆనందం వెతుక్కొనేవాడు. అలాంటిది ఇప్పుడు టీ64/టీ44 విభాగంలో పురుషుల హైజంప్లో 2.07మీ మీటర్లు దూకి ఏకంగా రజతం ముద్దాడాడు.
‘నేను బడికెళ్లే రోజుల్లో ఆటలే ప్రాణంగా బతికాను. కానీ ఈ స్థాయికి వస్తానని మాత్రం ఊహించలేదు. మొదట్లో నేను పాఠశాలలో వాలీబాల్ ఆడేవాడిని. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్ గురించి తెలుసుకొని హై జంప్ ఎంచుకున్నాను. నిజానికి గూగుల్లో శోధించిన తర్వాతే పారాలింపిక్స్ గురించి తెలుసుకున్నాను’ అని ప్రవీణ్ అన్నాడు.
తాను ఈ స్థాయికి రావడానికి గురువులే కారణమని ప్రవీణ్ పేర్కొన్నాడు. ‘నేను జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనప్పుడు అశోక్ సైని సర్ను కలిశాను. ఆయన నాకు సత్యపాల్ సర్ ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆయనను కలిశాక నేను ఏ విభాగంలో పోటీపడొచ్చో వివరించారు. నన్ను శిష్యుడిగా స్వీకరించారు. ఇదంతా 2018లో జరిగింది’ అని అతడు తెలిపాడు.
అంతర్జాతీయ క్రీడల్లో ప్రవీణ్ రెండేళ్ల కిందటే అరంగేట్రం చేశాడు. అతడు విశ్వ వేదికల్లో పోటీపడతానంటే చదువుకున్న పాఠశాల వారే నమ్మలేదు. 2019, జూనియర్ పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్లో రజతం గెలిచాక వారు అండగా నిలిచారు. ఈ ఏడాది దుబాయ్లో పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో స్వర్ణం గెలిచాడు.
శుక్రవారం పారాలింపిక్స్ హైజంప్ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం కాస్త తగ్గినట్టు అనిపించిందని ప్రవీణ్ తెలిపాడు. ‘రెండో దఫాలో 1.97 మీటర్లు ఎగిరినప్పుడు నా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంది. 2.01 మీటర్లు దూకిన తర్వాత పుంజుకున్నాను. ఏదేమైనా అత్యుత్తమంగా ఆడాలని అనుకున్నాను. 2.10 మీటర్లు ఎగిరినప్పుడు ఒత్తిడికి గురయ్యా. ల్యాండింగ్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి’ అని అతడు పేర్కొన్నాడు.
కరోనా మహమ్మారి వల్ల ప్రవీణ్ ఇబ్బందులు పడ్డాడని కోచ్ సత్యపాల్ తెలిపాడు. హైజంప్లో ల్యాండయ్యే సమయంలో భారీ దిండ్లు అవసరమని పేర్కొన్నాడు. స్టేడియాలు మూసేయడంతో సాధన సరిగ్గా చేయలేకపోయాడని వెల్లడించాడు. పైగా కరోనా బారిన పడ్డాడని వివరించాడు. ప్రవీణ్ పొడగరి కావడం, ఒక కాల్లో కండరాలు బలంగా ఉండటం కలిసొచ్చిందని పేర్కొన్నాడు. పారిస్ ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డులో స్వర్ణం సాధించడమే తమ తర్వాతి లక్ష్యమని ఆయన ప్రకటించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు