2016 Rio Olympics: ఆ ఒలింపిక్స్ బౌట్లు ఫిక్స్
2016 రియో ఒలింపిక్స్లో డబ్బు కోసం, ఇతర ప్రయోజనాల కోసం 10కి పైగా బాక్సింగ్ బౌట్ల ఫలితాలను తారుమారు చేశారనే సంచలన విషయం బయటకు వచ్చింది...
దిల్లీ: 2016 రియో ఒలింపిక్స్లో డబ్బు కోసం, ఇతర ప్రయోజనాల కోసం 10కి పైగా బాక్సింగ్ బౌట్ల ఫలితాలను తారుమారు చేశారనే సంచలన విషయం బయటకు వచ్చింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నియమించిన మెక్లారెన్ గ్లోబల్ స్పోర్ట్స్ సొల్యూషన్స్ (ఎమ్జీఎస్ఎస్) సంస్థ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తుతో ఇది వెలుగులోకి వచ్చింది. తమ విచారణకు సంబంధించిన తొలి దశ నివేదికను ఏఐబీఏకు ఈ సంస్థ అందించింది. దాని ప్రకారం రెండు ఫైనల్స్ సహా మొత్తం 14 బౌట్ల ఫలితాలలో ఇలా అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్ కంటే ముందే ఈ కుట్రకు అడుగులు పడ్డాయని, 2016 క్రీడల అర్హత రౌండ్లలో ట్రయల్ కూడా చేశారని తెలిసింది. అవినీతిపరులైన రిఫరీలు, న్యాయనిర్ణేతలు, డ్రా కమిషన్ అందులో భాగమయ్యారని నివేదిక వెల్లడించింది. అప్పటి ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ దీనికి బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొంది. ఆ ఒలింపిక్స్లో ముఖ్యంగా రెండు బౌట్లలో వచ్చిన ఫలితాలు ఈ అవినీతి వ్యవస్థకు నిదర్శనంగా నిలిచాయి. బాంటమ్వెయిట్ క్వార్టర్స్లో రష్యా బాక్సర్ వ్లాదిమిర్పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డప్పటికీ ప్రపంచ ఛాంపియన్ మైకెల్ను ఓడిపోయాడని ప్రకటించడంతో అతను రిఫరీ, న్యాయ నిర్ణేతలను దూషించాడు. హెవీవెయిట్ పసిడి పోరులో లెవిట్ (కజకిస్థాన్) ఆధిపత్యం ప్రదర్శించినా గెలవలేకపోయాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నుంచి తిరిగి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఏఐబీఏ ఈ నివేదిక నేపథ్యంలో రిఫరీలు, న్యాయ నిర్ణేతల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల 24న సెర్బియాలో ఆరంభమయ్యే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ కోసం రిఫరీలు, న్యాయ నిర్ణేతలు, సాంకేతిక ప్రతినిధుల ఎంపికలో ప్రమాణాలు, నేపథ్యం లాంటి విషయాలను ఇప్పుడు ఎమ్జీఎస్ఎస్ చూసుకోనుంది. ఈ కుట్రకు కారణమైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవడం కోసం న్యాయ సలహాలు తీసుకుంటామని ఏఐబీఏ అధ్యక్షుడు ఉమర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా