T20: కివీస్పై ఘన విజయం.. సిరీస్ను కైవసం చేసుకున్న భారత్
న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా
రాంచీ: కొత్త కోచ్.. నూతన సారథ్యం.. అసలే టీ20 ప్రపంచకప్లో సెమీస్కు చేరలేదనే అపవాదు. ఆ టోర్నీలోనే కివీస్పై ఓటమి.. విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు విశ్రాంతి.. ఈ నేపథ్యంలో భారత కుర్రాళ్లు అదరగొట్టేశారు. మూడు టీ20ల సిరీస్ను 2-0తేడాతో కైవసం చేసుకున్నారు. తొలి టీ20 మ్యాచ్లో ఆఖరి వరకు టెన్షన్ పెట్టినా... రెండో మ్యాచ్లో మాత్రం పట్టువిడవనీయకుండా విజయాన్ని ఒడిసి పట్టారు. మరోవైపు కివీస్ కూడా కీలక ఆటగాళ్లు లేకపోయినా ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ సాధ్యమైనంత వరకు గట్టిపోటీనే ఇచ్చింది. ఇక ఆఖరి మ్యాచ్ నవంబర్ 21న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్, నూతన టీ20 జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మలకిది తొలి సిరీస్ విజయం కావడం విశేషం.
టాస్ నెగ్గిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని కివీస్కు బ్యాటింగ్ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం భారత్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.2 ఓవర్లలో 155 పరుగులు చేసి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (65 పరుగులు: 6X4, 2X6), రోహిత్ శర్మ (55 పరుగులు: 1X4, 5X6)) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (1) విఫలం కాగా.. వెంకటేశ్ అయ్యర్ 12, రిషభ్ పంత్ 12* పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు.
మెరిసిన అరంగేట్ర బౌలర్
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఆరంభంలో భారత బౌలర్లు ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (31), డారిల్ మిచెల్ (31) ఇద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వారితోపాటు చాప్మన్ (21) ఔట్ కావడంతో వేగం మందగించింది. మిడిలార్డర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్ 150 పరుగులనైనా దాటగలిగింది. సీఫర్ట్ 13, నీషమ్ 3, సాట్నర్ 8*, మిల్నే 5* పరుగులు చేశారు. కివీస్ బ్యాటర్లలో కీలకంగా మారిన డారిల్ మిచెల్, ఫిలిప్స్ వికెట్లను భారత అరంగేట్ర బౌలర్ హర్షల్ పటేల్ (2/25) తీసి తన సత్తా చాటాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. మిగతా బౌలర్లలో అక్షర్ (1/26), అశ్విన్(1/19) రాణించగా.. భువనేశ్వర్ (1/39), దీపక్ చాహర్ (1/42) భారీగా పరుగులు సమర్పించారు.
నమోదైన రికార్డులు
* 50 స్కోరు కంటే ఎక్కువ నమోదైన సందర్భాలు: కోహ్లీ (29), రోహిత్ శర్మ (29: ఇందులో నాలుగు శతకాలు), బాబర్ అజామ్ (25), డేవిడ్ వార్నర్ (22)
* ఇతర బ్యాటర్తో కలిసి శతక భాగస్వామ్యాలు జోడించడంలో రోహిత్ శర్మ (13 సార్లు), బాబర్ అజామ్ (12), మార్టిన్ గప్తిల్ (12), డేవిడ్ వార్నర్ (11)
* అత్యధిక శతక భాగస్వామ్యాలు: బాబర్-రిజ్వాన్ (22 ఇన్నింగ్స్ల్లో 5 సార్లు), రోహిత్-కేఎల్ రాహుల్ (27 ఇన్నింగ్స్ల్లో 5 సార్లు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ