IND vs SA : దక్షిణాఫ్రికా గడ్డ మీద భువి చెత్త రికార్డు.. మూడో వన్డేకు భారీ మార్పులు?
వికెట్కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలిగే భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్..
ఇంటర్నెట్ డెస్క్: వికెట్కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలిగే భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ కొంతకాలంగా విఫలమవుతున్నాడు. 2019 వరల్డ్ కప్ నుంచి పవర్ప్లేలో 41 ఓవర్లు వేసిన భువనేశ్వర్ తీసిన వికెట్లు మూడంటే మూడే. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ విఫలమవుతున్న భువి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. స్లోగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్ల మీద వికెట్ల కోసం భువి చాలా శ్రమించాడు. అయితే ఈ సిరీస్లో ఆడిన రెండు వన్డేల్లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టకపోవడం గమనార్హం. మొత్తం 18 ఓవర్లు వేసిన భువి (64, 67) 7.27 ఎకానమీతో 131 పరుగులను సమర్పించుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన గత ఐదు వన్డేల గణాంకాలను పరిశీలిస్తే భువి ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. 36 ఓవర్లు వేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. 6.72 ఎకానమీతో 272 పరుగులు ఇచ్చాడు. దక్షిణాఫ్రికా పిచ్ల మీద భువనేశ్వర్ బౌలింగ్ యావరేజీ 200కిపైగా ఉంది. ఏ దేశం మీదనైనా సరే అత్యంత పేలవమైన ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్ భువీనే. టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఎస్ వెంకటరాఘవన్ (275) ఇంగ్లాండ్పై తొలి స్థానంలో ఉండగా.. యూఏఈలో రాబిన్ సింగ్ (207) రెండో స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్ దక్షిణాఫ్రికాలో మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడాడు. దాదాపు 60 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టి 400 పరుగులను సమర్పించుకోవడం గమనార్హం.
వారిని పక్కన పెడతారా?
నామమాత్రమైన మూడో వన్డేలో గెలిచి కాస్త పరువుతో ఇంటిముఖం పట్టాలని టీమ్ఇండియా భావిస్తోంది. బౌలింగ్లో విఫలమవుతున్న భువనేశ్వర్ను తొలగించి రిజర్వ్ బెంచ్పై ఉన్న సిరాజ్ లేదా ప్రసిధ్లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్లోనూ మార్పులు చేయాలని టీమ్ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ను తీసుకునే వెసులుబాటు భారత్కు ఉంది. ఇక బుమ్రాకీ, భువనేశ్వర్ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మూడో వన్డేకు టీమ్ఇండియా జట్టు ఇలా ఉండొచ్చని ఓ అంచనా..
భారత్: కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రుతురాజ్, రిషభ్ పంత్, సూర్యకుమార్, శార్దూల్, అశ్విన్, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ/సిరాజ్, చాహల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి