T20 World Cup: దంచికొట్టిన రోహిత్, రాహుల్.. అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం
టీ20 ప్రపంచ కప్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించగా..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించారు. రిషభ్ పంత్ (27; 13 బంతుల్లో 1 ఫోర్, మూడు సిక్స్లు), హార్దిక్ పాండ్య ( 35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) సైతం చివర్లో దూకుడుగా ఆడారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదీన్, కరీం జనత్ తలో వికెట్ పడగొట్టారు.
ఇద్దరూ పోటాపోటీ..
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పోటాపోటీగా బౌండరీలు బాదారు. షరాఫుద్దీన్ వేసిన రెండో ఓవర్లో కేఎల్ రాహుల్ ఫోర్, సిక్స్ బాదగా.. నవీన్ ఉల్ హక్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. తర్వాతి మూడు ఓవర్లో స్కోరు కాస్త నెమ్మదించింది. తర్వాత వీరిద్దరూ మళ్లీ ధాటిగా ఆడారు. దీంతో 10 ఓవర్లకు భారత్ స్కోరు 85/0 వద్ద నిలిచింది. రషీద్ఖాన్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్స్లు బాదిన రోహిత్ శర్మ తర్వాతి ఓవర్లోనే నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడారు. గుల్బాదీన్ వేసిన 17వ ఓవర్లో పంత్ రెండు సిక్సర్లు కొట్టాడు. 18వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన హార్ది్క్.. 19వ ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. 20వ ఓవర్లో పంత్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం