T20 World Cup: ‘కంగారు’ పెట్టించి కివీస్ కప్ కొట్టేస్తుందా?
ఇదే కసితో ఆడితే ఆస్ట్రేలియాను ఓడించి న్యూజిలాండ్ కప్ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ పొట్టి ప్రపంచకప్లో ఫైనల్కు చేరడానికి ఆ జట్టు ప్రయాణం ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థి జట్టుని సరైన సమయంలో దెబ్బకొట్టడంలో కివీస్ దిట్ట. అయితే, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆ జట్టు సర్వశక్తులు ఒడ్డినా.. ఛాంపియన్గా నిలవలేకపోయింది. ఇంగ్లాండ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఈ క్రమంలో ఆ జట్టు మరింత రాటుదేలింది. 2021 టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ని గెల్చుకుంది. 2019 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమికి కివీస్ ఈ టీ20 ప్రపంచకప్ సెమీస్లో ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్లో ఇంగ్లిష్ జట్టుని ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇదే కసితో ఆడితే ఆస్ట్రేలియాను ఓడించి కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ పొట్టి ప్రపంచకప్లో ఫైనల్కు చేరడానికి న్యూజిలాండ్ జట్టు ప్రయాణం ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం.
పాక్ చేతిలో పరాభావం..
ఈ టీ20 ప్రపంచకప్లో కివీస్ తన మొదటి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 138 పరుగుల నామమాత్రపు స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని పాకిస్థాన్ 18.4 ఓవర్లలో ఛేదించింది. దీంతో తొలి మ్యాచ్లోనే కివీస్కు ఎదురుదెబ్బ తగిలింది.
భారత్ను కట్టడి చేసి.. వేగంగా కొట్టేసింది
న్యూజిలాండ్ తన రెండో మ్యాచ్లో బలమైన టీమిండియాని ఢీకొట్టింది. పాకిస్థాన్ చేతిలో ఓడిన కసిమీదున్న కివీస్ ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. ఆ జట్టు బౌలర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లలో ఒక్కరూ కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. విరాట్ సేనను 110 పరుగులకే కట్టడి చేసిన విలియయ్సన్ బృందం ఆ స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలోనే ఛేదించేసింది.
స్కాట్లాండ్ను కంగు తినిపించి..
భారత్పై విజయం సాధించిన ఉత్సాహాంతో తన మూడో మ్యాచ్లో స్కాట్లాండ్ని కంగు తినిపించింది న్యూజిలాండ్. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (93; 56 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తర్వాత స్కాట్లాండ్ని 156 పరుగులకే కట్టడి చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
పసికూనపై పంజా.. హ్యాట్రిక్ గెలుపు
భారత్, స్కాట్లాండ్లపై విజయం సాధించి జోరుమీదున్న న్యూజిలాండ్ తన నాలుగో మ్యాచ్లో పసికూన అయిన నమీబియాతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు తక్కువ స్కోరుకే ఔటైనా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు గ్లెన్ ఫిలిప్స్ (39), జిమ్మీ నీషమ్ (35) రాణించడంతో మంచి స్కోరును సాధించింది. ఛేదనకు దిగిన నమీబియాను 111/7కు కట్టడి చేసిన కివీస్.. 52 పరుగుల తేడాతో నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
చెమటోడ్చి నెగ్గి సెమీస్కు
నమీబియాపై అలవోకగా విజయం సాధించిన కివీస్.. అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం చెమటోడ్చి నెగ్గింది. తొలుత అఫ్గాన్ని 124 పరుగులకే కట్టడి చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడింది. చివరకు 18.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని అందుకుని అఫ్గాన్పై గెలిచింది. ఒకవేళ అఫ్గానిస్థాన్ మరో 30-40 పరుగులు చేసుంటే కివీస్కు మ్యాచ్ గెలవడం కష్టంగా మారేది.
ఆ ఓటములకు ప్రతీకారం.. ఫైనల్లో అడుగు
తొలి మ్యాచ్లో ఓడినా.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో నెగ్గి సెమీస్కు దూసుకొచ్చిన న్యూజిలాండ్.. బలమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన విలియమ్సన్ సేనకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మార్టిన్ గప్తిల్, విలియమ్సన్ వికెట్లను మూడు ఓవర్లలోపే కోల్పోయి కష్టాల్లో పడింది. డారిల్ మిచెల్ (72) మెరవడంతోపాటు జిమ్మీ నీషమ్ (27; 11 బంతుల్లో) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో ఒక ఓవర్ మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైన కివీస్.. ఈ విజయంతో ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకుని ఫైనల్లోకి అడుగుపెట్టింది.
కంగారూలను కంగారు పెట్టిస్తుందా?
పాకిస్థాన్ని ఓడించి ఫైనల్కు చేరిన ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. రెండు జట్ల బలబలాలు, నాకౌట్ మ్యాచ్ల్లో ఇరు జట్ల ఫలితాలను బట్టి చూస్తే ఆస్ట్రేలియానే ఫేవరేట్గా కనిపిస్తోంది. కంగారులకు ఏ మాత్రం అవకాశం ఇచ్చినా చెలరేగిపోతారు. పాకిస్థాన్తో జరిగిన సెమీస్లో ఇదే రిపీట్ అయింది. వేడ్ (41) ఇచ్చిన క్యాచ్ని హసన్ అలీ జారవిడిచాడు. ఆ వెంటనే అతడు మూడు సిక్స్లు కొట్టి పాక్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లాడు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ పేస్ ద్వయం, స్పిన్నర్లు శాంటర్న్, సోధీ చెలరేగితే కంగారులకు తిప్పలు తప్పవు. ఏది ఏమైనా ఇందులో ఏ జట్టు గెలిచినా కొత్త ఛాంపియన్గా అవతరిస్తుంది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!