T20 World Cup Final: టాస్ గురించి ఆందోళన చెందట్లేదు: ఆరోన్ ఫించ్
టీ20 ప్రపంచకప్ పైనల్లో టాస్ గురించి ఆందోళన చెందట్లేదని, మ్యాచ్ ఫలితం దానిపై ఆధారపడి ఉండదని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ వేదికగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి ఫించ్ ప్రస్తావించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ పైనల్లో టాస్ గురించి ఆందోళన చెందట్లేదని, మ్యాచ్ ఫలితం దానిపై ఆధారపడి ఉండదని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ వేదికగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి ఫించ్ ప్రస్తావించాడు. అక్కడ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. అయితే, దుబాయ్లో ఇప్పటివరకు 17 మ్యాచ్లు రాత్రివేళ జరగ్గా.. ఛేదనకు దిగిన జట్టు 16 మ్యాచ్ల్లో విజయం సాధించడం విశేషం. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆసీస్ ఐదు విజయాలు సాధించగా..అన్నింట్లోనూ రెండోసారి బ్యాటింగ్ (ఛేదన) చేయడం గమనార్హం.
‘‘టాస్ గురించి ఆందోళనపడట్లేదు. దాన్ని కచ్చితంగా అధిగమించవచ్చు. టోర్నమెంట్లో కొన్నిసార్లు తొలుత బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టోర్నీలో గెలవాలంటే ముందుగా ఆ జట్టు బ్యాటింగ్లో గెలవాలి. పాకిస్థాన్తో జరిగిన సెమీ ఫైనల్లో నేను టాస్ ఓడిపోవాలని ఆశించా. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచడానికి ఇష్టపడతాను. దాంతో చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో ప్రత్యర్థి జట్టు ప్రారంభంలో రిస్క్ తీసుకుంటుంది’ అని ఫించ్ అన్నాడు.
"ప్రపంచంలోని చాలా జట్లు టీ20 క్రికెట్లో ఛేజింగ్ను ఇష్టపడతాయని భావిస్తున్నా. అయితే ఇది రిస్క్తో కూడుకున్నది. ఒక జట్టు భారీ స్కోరును చేస్తే దాన్ని ప్రత్యర్థి జట్టు ఛేదించడం కష్టం. కానీ, ఈ టోర్నీలో ఛేదనకు దిగిన జట్టే గెలుస్తోంది. న్యూజిలాండ్ ఎంత పోటీగా ఆడుతుందో తెలుసు. ఆ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఎలాంటి స్థితిలోనైనా పోరాడి మ్యాచ్లో పైచేయి సాధించగలదు’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, ఆసీస్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.