IND vs SA : ఆ సమయంలో కేఎల్ రాహుల్ వ్యూహాలేంటో అర్థం కాలేదు: గావస్కర్
తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్లను కట్టడి చేయడంలో...
ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సరైన ప్రణాళికలను కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేయలేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. సఫారీల జట్టు సారథి టెంబా బవుమా- డస్సెన్ జంట 204 పరుగులను జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలను నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు బుమ్రా, భువనేశ్వర్తో ఎక్కువ ఓవర్లు వేయిస్తే బాగుండేదని గావస్కర్ విశ్లేషించాడు. అంతేకాకుండా వెంకటేశ్ అయ్యర్తో బౌలింగ్ చేయించాల్సిందని పేర్కొన్నాడు. దీని కోసం కేఎల్ రాహుల్ ఆలోచనల్లో కూరుకుపోయినట్లుగా ఉందని తెలిపాడు.
‘‘ప్రత్యర్థి జట్టు నుంచి మంచి భాగస్వామ్యం నమోదైనప్పుడు.. ఎలాంటి కెప్టెన్కైనా ఆలోచించడం కష్టమే. తొలి వన్డేలో ఏం జరింగిందో అర్థమైంది. ఆ మైదానం బ్యాటింగ్కు అనుకూలం. బ్యాట్ మీదకు బంతి చాలా సులువుగా వచ్చింది. అయితే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లు భారత్ సొంతం. బుమ్రా, భువనేశ్వర్కు కనీసం ఐదారు ఓవర్లు ఉంచాల్సింది. భారీ స్కోరు సాధించకుండా ఆతిథ్య జట్టును అడ్డుకునేందుకు రాహుల్ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటో కూడా తెలియలేదు. అంతర్జాతీయ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. కాబట్టి వచ్చే మ్యాచ్ల్లో జట్టును విజయవంతంగా నడిపిస్తాడని ఆశిద్దాం’’ అని సునిల్ గావస్కర్ వివరించాడు.
దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ (79) చక్కని ఇన్నింగ్స్ ఆడాడని గావస్కర్ అభినందించాడు. ‘‘ధావన్ విషయానికొస్తే.. 50 ఓవర్ల గేమ్లో నిలకడగా పరుగులు చేస్తుంటాడు. పొట్టి ఫార్మాట్లో అంతగా రాణించలేడు. అందుకే రన్స్ చేసేంతవరకు బ్యాక్గ్రౌండ్ను హోల్డ్లో పెట్టేయాల్సిందే. ఇక అతడి వయస్సు, ఫిట్నెస్ వంటి వాటిపై మాట్లాడకూడదు’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా
కోల్కతాతో జరిగిన మ్యాచ్లో టీవీ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో అతడికి ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. -
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
Suresh Raina: ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఆకస్మికంగా వైదొలగడంపై సురేశ్ రైనా ఎట్టకేలకు స్పష్టతనిచ్చాడు. బంధువులు హత్యకు గురవడం వల్లే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని వెల్లడించాడు. -
అతడో ‘లెర్నింగ్ మెషిన్’.. గుకేశ్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గిన భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ విజయంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
ఇకనైనా బౌండరీ లైన్ల పరిధిని పెంచండి..: సునీల్ గావస్కర్
ఐపీఎల్ జరిగే కొద్దీ బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. బౌలర్లు చేష్టలుడిగి చూసేందుకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
సామ్ కరన్కు 50 శాతం.. డుప్లెసిస్కు రూ. 12 లక్షల ఫైన్
ఆదివారం జరిగిన రెండు మ్యాచుల్లో.. ఇద్దరు కెప్టెన్లకు జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
వారికి పార్టీలు ఎక్కువ.. అందుకే ఒక్క టైటిలూ లేదు: సురేశ్ రైనా
చెన్నై జట్టు విజయవంతంగా కొనసాగడంలో సురేశ్ రైనా కూడా కీలక పాత్ర పోషించాడు. ధోనీ తర్వాత ఆ జట్టు అభిమానులు ఎక్కువగా ఇష్టపడేది క్రికెటర్ రైనానే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
కోల్కతాతో మ్యాచ్.. చర్చకు దారితీసిన కోహ్లీ ఔట్ వివాదం!
కోల్కతా నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో చివరి వరకూ వచ్చిన బెంగళూరు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే, విరాట్ కోహ్లీ ఔట్ నిర్ణయంపై వివాదాస్పదమైంది. -
కోహ్లీ ఆగ్రహానికి కారణమదే.. రూల్ ప్రకారం వెళ్లక తప్పదు: డుప్లెసిస్
ఐపీఎల్ 17వ సీజన్లో ఇంటిముఖం పట్టే తొలి జట్టుగా బెంగళూరు నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరుసగా ఆరో ఓటమితో ప్లే ఆఫ్స్కు దాదాపు దూరమైనట్లే. -
యంగ్ ‘క్యాండిడేట్’గా గుకేశ్.. చరిత్ర సృష్టించిన చెస్ ప్లేయర్
భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ మరో రికార్డు సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే ‘క్యాండిడేట్స్’ విజేతగా నిలిచాడు. -
బెంగళూరు ఓటమి నం.7
బ్యాటర్ కర్ణ్ శర్మ, బౌలర్ స్టార్క్. 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఆర్సీబీ పనైపోయిందనే అనుకున్నారంతా. కానీ అనూహ్యం.. నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాదేశాడు కర్ణ్. 2 బంతుల్లో 3 చేస్తే చాలు బెంగళూరుదే విజయం. -
143.. అయినా కష్టంగా!
ఓవైపు కొన్ని జట్లు సిక్సర్ల మోత మోగించేస్తూ 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేస్తున్న ఈ ఐపీఎల్లో ఆదివారం పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థికి 143 పరుగుల లక్ష్యమే నిర్దేశించింది. -
కోహ్లీకి కోపమొచ్చింది
కోల్కతాతో మ్యాచ్లో కోహ్లీకి కోపమొచ్చింది. ఆడిన ఆరు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన అతను ఛేదనలో దూకుడు ప్రదర్శించాడు. -
ఆర్సీబీ ఇంటికే!
ఐపీఎల్- 17వ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవబోతున్నట్లే! 8 మ్యాచ్ల్లో ఓ విజయం, 7 ఓటములతో 2 పాయింట్లు మాత్రమే సాధించిన ఆ జట్టు.. పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. -
టైటిల్ దిశగా గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న భారత యువ సంచలనం గుకేశ్ టైటిల్కు చేరువయ్యాడు. మరో రౌండ్ మాత్రమే మిగిలివున్న ఈ టోర్నీలో గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. -
తిరుగులేని వెర్స్టాపెన్
ఫార్ములావన్ స్టార్ రేసర్, డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్కు తిరుగులేదు. అద్భుత ప్రదర్శన కొనసాగుతున్న ఈ రెడ్బుల్ రేసర్ ఈ సీజన్లోనూ వరుస విజయాలు నమోదు చేస్తున్నాడు. -
ఒలింపిక్స్కు బల్రాజ్, అక్ష్దీప్, ప్రియాంక
ప్రపంచ ఆసియా ఓసియానియా ఒలింపిక్, పారాలింపిక్ అర్హత రెగెట్టా టోర్నీలో భారత రోయింగ్ ఆటగాడు బల్రాజ్ పన్వర్ సత్తాచాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్ 2000 మీటర్ల విభాగంలో బల్రాజ్ మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నాడు. -
పారాలింపిక్స్కు వెంకటనారాయణ
నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్కు అర్హత సాధించాడు. -
టెన్నిస్కు ముగురుజ వీడ్కోలు
రెండుసార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్ గార్బైన్ ముగురుజ (స్పెయిన్) టెన్నిస్కు వీడ్కోలు పలికింది. ‘‘రిటైర్ కావడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నా. -
సంక్షిప్త వార్తలు(5)
బిష్కెక్ ప్రపంచ క్వాలిఫయర్స్లో భారత రెజ్లర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో టర్కీలో జరిగే ఆఖరి క్వాలిఫయర్స్ కోసం మరోసారి ట్రయల్స్ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని రెజ్లింగ్ సమాఖ్య యోచిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు