Axar Patel : బేసిక్స్కు కట్టుబడ్డా.. ఫలితం సాధించా: అక్షర్ పటేల్
కాన్పూర్ వేదికగా కివీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యం సాధించడంలో...
ఇంటర్నెట్ డెస్క్: కాన్పూర్ వేదికగా కివీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యం సాధించడంలో అక్షర్ పటేల్ (5/62) కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో న్యూజిలాండ్ను 296 పరుగులకే టీమ్ఇండియా కట్టడి చేయగలిగింది. ఈ సందర్భంగా తన ప్రదర్శనపై అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఆరంభం ఈ విధంగా ఉండాలని భావించా. టెస్టు క్రికెట్ అంత సులభం కాదు. ఇవాళ చాలా కష్టమైన రోజు. ఎందుకంటే నిన్న కివీస్ ఎలాంటి వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ప్రారంభించింది. అప్పటికే ఓపెనర్లు క్రీజ్లో కుదురుకుని పోయారు. ఇలాంటి సందర్భంలో ప్రతి బంతికి వికెట్ తీద్దామని కాకుండా ఓపిగ్గా బౌలింగ్ చేయాలని జట్టు సభ్యులం మాట్లాడుకున్నాం. నా బేసిక్స్కు కట్టుబడి బౌలింగ్ చేశా. అంతేకాకుండా క్రీజ్ను కూడా అనుకూలంగా మార్చుకుని ఉపయోగించుకోవడంతో వికెట్లు దక్కాయి. ట్రాక్ ఎంతో నెమ్మదించింది. ఇవాళ టర్న్ అవుతోంది. అప్పుడప్పుడు బౌన్స్ కూడా అవుతోంది. దాన్ని వినియోగించుకుని రౌండ్ ఆర్మ్ డెలివరీలు సంధించా. అయితే క్రీజ్లో బ్యాటర్లు కుదురుకుంటే మాత్రం పరుగులు వస్తాయని ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని అక్షర్ పేర్కొన్నాడు.
కీపింగ్లో చురుగ్గా వ్యవహరించిన భరత్
వృద్ధిమాన్ సాహా స్థానంలో కీపింగ్కు వచ్చిన కేఎస్ భరత్ తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. కివీస్ ఓపెనర్లు లేథమ్ (95), విల్ యంగ్ (89), రాస్ టేలర్ (11) ఔట్లో భరత్ కీలక పాత్ర పోషించాడు. మరీ ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్లో విల్ యంగ్ క్యాచ్ను అందుకున్న భరత్.. టీమ్ఇండియా అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. అశ్విన్ బంతిని కట్ చేయబోయిన విల్ యంగ్ బ్యాట్కు ఎడ్జ్ తీసుకుంది. అయితే అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. వెంటనే కీపర్ భరత్ డీఆర్ఎస్కు వెళ్లాలని కెప్టెన్ రహానె, బౌలర్ అశ్విన్కు సూచించాడు. డీఆర్ఎస్కు వెళ్లిన భారత్కు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. విల్ యంగ్ బ్యాట్కు ఎడ్జ్ తీసుకున్నట్లు తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అలానే సెంచరీకి చేరువైన లేథమ్ను భరత్ స్టంప్ ఔట్ చేశాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.