IND vs SL: శ్రీలంక లక్ష్యం 133

శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు.దీంతో ప్రత్యర్థి

Updated : 28 Jul 2021 22:17 IST

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ప్రత్యర్థి ముందు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది టీమ్‌ఇండియా. తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన లంక జట్టు ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దిగింది. దీంతో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో బోర్డును ముందుకు నడిపించడం భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టతరంగా మారింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడంలో టీమిండియా విఫలమైంది. జట్టు సారథి శిఖర్‌ ధావన్‌ (40) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా రాణించలేదు. అరంగేట్రం చేసిన రుతురాజ్ (21)‌, పడిక్కల్‌ (29) ఫర్వాలేదనించగా.. సంజూ శాంసన్‌ (7) నిరాశపర్చాడు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ రెండు, హసరంగ, శనక, చమీరా తలో వికెట్‌ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని